fbpx
HomeTelanganaపోలియో చుక్కలు వేసిన కాసేపటికే మరణించిన చిన్నారి

పోలియో చుక్కలు వేసిన కాసేపటికే మరణించిన చిన్నారి

CHILD-DIED-TAKING-POLIO-VACCINE-IN-TELANGANA

హైదరాబాద్‌: నిన్న అనగా ఆదివారం పోలియో చుక్కలు వేయించిన కొద్ది నిమిషాలకే ఒక 3 నెలల పసిపాప మరణించింది. ఈ ఘటన తెలంగాణ దుండిగల్‌ మున్సిపాలిటీ పరిధిలోని శంభీపూర్‌లో చోటు చేసుకుంది. జగద్గిరిగుట్టకు చెందిన యాదగిరి, రమ్య దంపతులకు దీక్షిత అనే (3 నెలల) చిన్న పాప సంతానం ఉంది.

మహేశ్వరంలో రమ్య తన అమ్మ గారి ఇంటికి వెళ్లి ఆదివారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో చిన్నారికి శంభీపూర్‌లోని అంగన్‌వాడీ కేంద్రంలో పోలియో చుక్కలు వేయించింది. టీకా వేయించి ఇంటికి వెళ్లిన 15 నిమిషాలకే చిన్నారి నుంచి ఎలాంటి ఉలుకూపలుకూ లేకుండా ఉంది. చిన్నారిలో చాలా సేపటికి చలనం లేకపోవడంతో ఆందోళనకు గురైన కుటుంబసభ్యులు మదీనాగూడలోని చిన్న పిల్లల ఆస్పత్రికి తీసుకెళ్లారు.

అక్కడ డాక్టర్ పరీక్షించి చిన్నారి అప్పటికే మృతి చెందిందని వైద్యులు పేర్కొన్నారు. పోలియో వ్యాక్సిన్‌ వికటించడం వల్లనే తమ కూతురు మృతి చెందిందని పేర్కొంటూ చిన్నారి కుటుంబ సభ్యులు, బంధువులు అంగన్‌వాడీ కేంద్రం వద్దకు వెళ్ళి ఆందోళనకు దిగారు.

కాగా మేడ్చల్‌ జిల్లా వైద్యాధికారి మల్లికార్జున్, దండిగల్‌ మండల వైద్యాధికారి నిర్మల, సీఐ వెంకటేశం, ఎస్‌ఐ చంద్రశేఖర్‌ అంగన్‌వాడీ కేంద్రం వద్దకు చేరుకుని బాధిత కుటుంబ సభ్యులను సముదాయించడంతో ఆందోళన విరమించారు. ఈ సందర్భంగా మల్లికార్జున్‌ మాట్లాడుతూ, ఇదే బూత్‌లో 250 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేశామని, వారందరూ క్షేమంగానే ఉన్నారని తెలిపారు. పాప జనిమించిన సమయంలో ఏదైనా అనారోగ్య సమస్యలుంటేనే ఇలా జరగడానికి ఆస్కారముందని, పోస్ట్‌మార్టమ్‌ నివేదికలోనే నిజానిజాలు బయటకు వస్తాయని, అప్పటి వరకు ఏ విషయం చెప్పలేమన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular