చండీగఢ్: ఇటీవలే పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింఘ్ రాజీనామా చేయడంతో, పంజాబ్ కి కొత్త ముఖ్యమంత్రిగా చరణ్జీత్ సింగ్ చన్నీకి అవకాశం ఇచ్చింది కాంగ్రెస్ అధిష్టానం. ఇవాళ సమావేశమైన కాంగ్రెస్ శాసన సభా పక్షం ముఖ్యమంత్రి చన్నీని ఏకగ్రీవంగా ఎన్నుక చేసింది. దీనికి సంబంధించి పంజాబ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి హరీష్ రావత్ ట్విటర్లో వెల్లడించారు.
కాగా తాజా మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్, పీసీసీ చీఫ్ నవజోత్ సింగ్ సిద్ధూ మధ్య విభేదాల వల్ల పంజాబ్ లో రాజకీయ అనిశ్చితి తలెత్తింది. ఇంకోవైపు అధిష్టానం కూడా కెప్టెన్ రాజీనామాకే మొగ్గు చూపిందన్న నేపథ్యంలోనే అమరీందర్ సింగ్ శనివారం రాజీనామా చేశారు. ఆయనతో పాటు మంత్రులు కూడా గవర్నర్కు రాజీనామా సమర్పించగా ఆయన కూడా వెంటనే ఆమోదించారు.
దళిత వర్గానికి చెందిన నేత చరణ్ జీత్ సింగ్ చన్నీ. తొలుత సుఖ్జీందర్ సింగ్ రాంద్వాను పంజాబ్ సీఎంగా నియమించాలని భావించినా కాంగ్రెస్కు నవజ్యోత్సింగ్ సిద్దూ వర్గం నుంచి వ్యతిరేకత రావడంతో తిరిగి పునరాలోచనలు చేయాల్సి వచ్చిందని సమాచారం. చరణ్జిత్ సింగ్ చన్నీకి శుభాకాంక్షలు తెలియజేశారు మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింఘ్.