fbpx
HomeNationalజెట్ ఎయిర్వేస్ సిబ్బందికి ఫోన్,ఐపాడ్ లేదా లాప్ టాప్!

జెట్ ఎయిర్వేస్ సిబ్బందికి ఫోన్,ఐపాడ్ లేదా లాప్ టాప్!

BUMPER-OFFER-FOR-JETAIRWAYS-EMPLOYEES-LABOUR

న్యూఢిల్లీ: జెట్ ఎయిర్‌వేస్ సిబ్బంది కి బంపర్ ఆఫర్ లభించింది. దివాలా ప్రక్రియలో భాగమైన జెట్‌ ఎయిర్‌వేస్‌ను సొంతం చేసుకోనున్న కంపెనీ అందులోని సిబ్బందికి ఫోన్‌ కానీ ఐప్యాడ్‌ కానీ ల్యాప్‌టాప్‌ను ఆఫర్‌ చేస్తోంది. దానితోపాటు నగదును కూడా చెల్లించేందుకు ప్రతిపాదించింది.

జాతీయ కంపెనీ చట్ట ట్రిబ్యునల్‌(ఎన్‌సీఎల్‌టీ) అనుమతించిన రుణ పరిష్కార ప్రణాళికలో భాగంగా జెట్‌ ఎయిర్‌వేస్‌ సిబ్బందిలో కనీసం 95 శాతం టేకోవర్‌కు అనుకూలంగా ఓటింగ్‌ వేయవలసి ఉంటుంది. అలా జరిగితేనే జెట్‌ ఎయిర్‌వేస్‌ కొనుగోలు బిడ్‌కు క్లియరెన్స్‌ వస్తుంది. జలాన్‌ కల్రాక్‌ కన్సార్షియం జెట్‌ ఎయిర్‌వేస్‌ను కొనుగోలు చేసేందుకు బిడ్‌ను గెలుపొందింది.

జెట్ ఎయిర్‌వేస్ కంపెనీ సిబ్బంది(ఉద్యోగులు, కార్మికులు) ప్రయోజనాల నేపథ్యంలో టేకోవర్‌ ప్రక్రియకు ఈ నెల 5న ప్రారంభమైన ఓటింగ్‌ ఆగష్ట్‌ 4వ తేదీ వరకూ కొనసాగుతుంది. గత నెల 22న ఎన్‌సీఎల్‌టీ కొన్ని షరతులతో జలాన్‌ కల్రాక్‌ కన్సార్షియంకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. దీనిలో భాగంగా కంపెనీ సిబ్బందికి కొన్ని రకాల లబ్ధిని చేకూర్చేందుకు కన్సార్షియం ఆమోదించింది.

జెట్‌ ఎయిర్‌వేస్‌ లో పని చేసే సిబ్బంది(కార్మికులు)కి టేకోవర్‌ కంపెనీ ఫోన్‌ లేదా ఐప్యాడ్‌ లేదా ల్యాప్‌టాప్‌ను ఇవ్వనుంది, అలాగే వారికి రూ. 22,800 చొప్పున నగదును చెల్లించనుంది. ఇక ఉద్యోగులకు మాత్రం ఒక్కొక్కరికీ రూ.11,000 చొప్పున అందించబోతోంది. జెట్‌ ఎయిర్‌వేస్‌ను సొంతం చేసుకునేందుకు జలాన్‌ కల్‌రాక్‌ కన్సార్షియం మొత్తంగా నగదు రూపేణా రూ. 1,375 కోట్లను ఖర్చు చేయనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular