హైదరాబాద్: వినాయక చవితి అంటేనే ఖైరతాబాద్ పెద్ద వినాయకుడు, హైదరా బా ద్ అంతా నిమజ్జన వేడుకలతో పాటు అంతే ప్రాచుర్యం పొందినది బాలాపూర్ లడ్డూ వేలం. అత్యంత ప్రాచుర్యం పొందిన ఈ బాలాపూర్ లడ్డు ఈ సారి వేలం పాటలో లడ్డూ రికార్డు ధర పలికింది. ఈ సారి ఈ లడ్డూని ఏకంగా రూ. 18.90 లక్షలకు మర్రి శశాంక్ రెడ్డి, ఎమ్మెల్సీ రమేశ్ వేలం పాటలో దక్కించుకున్నారు.
కిర్తం సారి 2019లో కొలను రామిరెడ్డి 17లక్షల 67వేలకు బాలాపూర్ లడ్డూను కైవసం చేసుకోగా ఇప్పుడు ఈ సంవత్సరం అంతకంటే ఎక్కవ ధరకు వేలం జరిగింది. బాలాపూర్ గణేష్ శోభాయాత్ర ఘనంగా ముగిసింది. ఈ శోభయాత్ర 17 కిలోమీటర్లమేర అంగరంగ వైభవంగా కొనసాగింది. బాలాపూర్ వినాయకుడిని యథావిధిగా హుస్సేన్సాగర్లో నిమజ్జనం చేశారు.
ఎంతో ప్రాచుర్యం పొందిన బాలాపూర్ గణేషుడి లడ్డూ ప్రతి సంవత్సరం 21కిలోల బరువుతో సిద్ధం చేస్తారు. 1980లో బాలాపూర్ లడ్డూ సంప్రదాయం మొదలవ్వగా, వేలం మొదలైంది మాత్రం 1994లోనే. విఘ్నాలు తొలగించే వినాయకుడి ప్రసాదం అంటే భక్తులందరికీ పరమ పవిత్రంగా భావిస్తారు. ఈ లడ్డూ తింటే విఘ్నేశ్వరుడి కరుణా కటాక్షాలు లభిస్తాయని నమ్మకం. అందుకే గణనాథుడి ప్రసాదం కోసం భక్తులతోపాలు ప్రముఖులు సైతం పోటీపడతారు.