fbpx
HomeAndhra Pradeshఏపీ ప్రభుత్వం ఆర్టీపీసీఆర్‌ టెస్టు రేటుల సవరణ!

ఏపీ ప్రభుత్వం ఆర్టీపీసీఆర్‌ టెస్టు రేటుల సవరణ!

AP-REVISED-RTPCR-TESTS-PRICE

అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్‌ నిర్ధారణ కోసం ఉపయోగించే ఆర్టీపీసీఆర్ పరీక్ష‌కు అయ్యే ధరలను సవరిస్తూ ఏపీ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులను జారీ చేసింది. ఐసీఎంఆర్‌ గుర్తింపు కలిగిన ఎన్‌ఏబీఎల్‌ ప్రైవేటు ల్యాబ్‌లలో ఆర్టీపీసీఆర్‌ ధరను రూ.350గా నిర్ణయించింది.

ఆస్పత్రులు, ల్యాబ్‌లలో కచ్చితంగా సవరించిన రేట్లను ప్రదర్శించాలని ఆదేశించింది. జిల్లా వైద్యాధికారులు సవరించిన రేట్లకే పరీక్షలు జరిగేలా నిరంతరం పర్యవేక్షించాలని సూచించింది. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వం పంపే శాంపిళ్ల టెస్టుకు రూ.475, అలాగే ఎన్‌ఏబీఎల్‌ ల్యాబ్‌లలో రూ.499 వసూలు చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular