fbpx
HomeAndhra Pradeshఏపీలో కరోనా పాజిటివ్‌ రేట్‌ 17%, పెరుగుతున్న కేసులు

ఏపీలో కరోనా పాజిటివ్‌ రేట్‌ 17%, పెరుగుతున్న కేసులు

AP-POSITIVITY-RATE-17%-CASES-SURGE-DAILY

మంగళగిరి: ఏపీలో రోజురోజుకు కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. కొత్తగా గత 24 గంటల్లో ఏకంగా 20,034 కేసులు నిర్ధారణ కాగా, 82 (0.41 %) మందిమరణాలు సంభవించాయి. తాజాగా ఏపీలో పాజిటివ్‌ రేటు 17.3 శాతంగా ఉంది. కాగా రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 1,17,784 పరీక్షలు చేసినట్లు వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి తెలిపారు. రాష్ట్రంలో 533 ఐసీయూ బెడ్స్ ఖాళీగా ఉన్నాయని వెల్లడించారు. 21,857 ఆక్సిజన్ బెడ్స్ ఉంటే 20,017 నిండిపోయాయని తెలిపారు.

ఇంత వరకు 104 కాల్ సెంటర్‌కు 16,856 కాల్స్ వచ్చాయని. 9 లక్షలు వ్యాక్సిన్ డోసులు ఈనెల 15వ తేదీలోపు అందుబాటులోకి రానున్నాయని ప్రకటించారు. వ్యాక్సినేషన్‌లో మీడియా, బ్యాంక్ సిబ్బందికి మొదటి ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు. రెమిడెసివర్ ప్రైవేట్ ఆస్పత్రుల్లో 14,030 రెమిడెసివర్‌ డోసులు ఇచ్చామని వివరించారు.

ప్రభుత్వ ఆస్పత్రుల్లో 21,898 డోసెస్ అందుబాటులో ఉన్నాయని, త్వరలోనే 12 వేలు రెమిడెసివర్ డోసులు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. ఇప్పటి వరకు 446 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ సరఫరా చేశామని, 3 ట్యాంకర్లు ఈరోజు అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. కోవిడ్ తీరుపై రేపు మంత్రి వర్గ ఉప సంఘం సమావేశం జరగనుందని అనిల్‌కుమార్‌ సింఘాల్‌ తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular