fbpx
Sunday, April 28, 2024
HomeAndhra Pradeshరాష్ట్రంలో ఆక్సిజన్ కొరత లేదంటున్న ఏపీ మంత్రి మేకపాటి

రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత లేదంటున్న ఏపీ మంత్రి మేకపాటి

AP-HAS-SUFFICIENT-OXYGEN-SAYS-MINISTER-GOWTHAM

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆక్సిజన్ కు ఎలాంటి కొరత లేదని ఆ రాష్ట్ర పర్రిశమల శాఖ మంత్రి గౌతమ్‌రెడ్డి ఇవాళ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ అవసరాలకే ఆక్సిజన్ విషయంలో తొలి ప్రాధాన్యత అని, దాని తర్వాతే ఇతర రాష్ట్రాలకు సరఫరా చేస్తామని ఆయన తెలిపారు.

కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాలకు ముందుగా ఆక్సిజన్ సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు. మెడికల్ ఆక్సిజన్‌ సరఫరాపై క్షేత్రస్థాయి నిఘా ఏర్పాటు చేశామన్నారు. ఏపీలో 40 రకాల పరిశ్రమల ద్వారా 510 ఎంటీ మెడికల్ ఆక్సిజన్ తయారీ చేస్తున్నామన్నారు.

రాష్ట్రంలో ఒక రోజుకి 300 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌ ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నాట్లు పేర్కొన్నారు. ఆక్సిజన్‌ సరఫరాపై గురువారం ఆయన సమీక్ష జరిపారు. ఈ సమీక్షలో మంత్రి హోం శాఖ కార్యదర్శి కుమార్ విశ్వజిత్, పరిశ్రమల శాఖ డైరెక్టర్ సుబ్రహ్మణ్యం జవ్వాది, వైద్య శాఖ, ఆక్సిజన్ సరఫరాకు సంబంధించిన నోడల్ అధికారి, 13 జిల్లాల పరిశ్రమల శాఖ అధికారులు, ఆర్ఐఎన్ఎల్, ఎల్లెన్ బెర్రీ తదితర పరిశ్రమలకు చెందిన ప్రతినిధులు హాజరయ్యారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular