fbpx
HomeAndhra Pradeshఇప్పట్లో ఎన్నికలు సురక్షితం కాదు: ఏపీ సీఎస్

ఇప్పట్లో ఎన్నికలు సురక్షితం కాదు: ఏపీ సీఎస్

AP-ELECTIONS-NOT-SAFE-AMID-COVID

అమరావతి: ఏపీ సీఎస్ నీలంసాహ్ని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌కు స్థానిక ఎన్నికలపై లేఖ రాశారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్రంలో పరిస్థితులు అంత అనుకూలంగా లేవని ఆమె తన లేఖలో స్పష్టం చేశారు.

రాష్ట్రంలో అధికార యంత్రాంగమంతా కరోనా విధుల్లో ఉన్నారని, ఎన్నికల నిర్వహణపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించాల్సిన అవసరం ఇప్పుడు లేదని పేర్కొన్నారు. రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసులు ఎక్కువగా ఉన్నాయని కూడా తెలిపారు. అదీకాక గ్రామీణ ప్రాంతాలకు కూడా కరోనా విస్తరించిందనని, ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహిస్తామనడం ఏ మాత్రం ప్రజాహితం కాదని పేర్కొన్నారు.

కరోనాను ఎదుర్కోవడంలో ఒక్కో రాష్ట్రం ఒక్కో రకమైన వ్యూహాన్ని అమలు చేస్తున్నాయని, ఒక రాష్ట్రాన్ని, మరో రాష్ట్రంతో పోల్చడం సబబు కాదన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే 6,890 మంది కరోనాతో మరణించారని, రాబోయే రోజుల్లో కోవిడ్ తీవ్రత ఎక్కువగా ఉంటుందని కేంద్ర ప్రభుత్వం కూడా తెలిపిందని ఆమె ఈ సందర్భంగా గుర్తుచేశారు.

ఎన్నికల నిర్వహణ విషయంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ తన నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోవాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు సమాయత్తం అయ్యాక ఆ చర్యలకు శ్రీకారం చుట్టడం మేలు అని పేర్కొన్నారు. ఈ అంశాలన్నింటిని ఎన్నికల కమిషన్‌ సానుకూలంగా పరిగణిస్తుందని భావిస్తున్నానని నీలంసాహ్ని లేఖలో ప్రస్తావించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular