fbpx
Friday, April 26, 2024
HomeAndhra Pradeshన్యూ ఎడ్యుకేషనల్ పాలసీ ప్రకారం ఏపీలో డిగ్రీ ఇకపై నాలుగేళ్ళు!

న్యూ ఎడ్యుకేషనల్ పాలసీ ప్రకారం ఏపీలో డిగ్రీ ఇకపై నాలుగేళ్ళు!

AP-DEGREE-FOUR-YEARS-FROM-NEXT-ACADEMIC-YEAR

అమరావతి: రాబోయే 2022-23 విద్యా సంవత్సరం నుండి ఏపీలో కృష్ణా యూనివర్సిటీ అనుబంధ కాలేజీల్లో డిగ్రీ కోర్సు ఇకపై నాలుగేళ్లు ఉండేలా వర్సిటీ అకడమిక్‌ సెనేట్‌ కీలక నిర్ణయం తీసుకుంది. వర్సిటీ సమావేశ మందిరంలో మంగళవారం అకడమిక్‌ సెనేట్‌ ఇవాళ సమావేశమైంది.

వైస్‌ చాన్స్‌లర్‌ కేబీ చంద్రశేఖర్, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎం. రామిరెడ్డి, సీడీసీ డీన్‌ సుందరకృష్ణ పాటు కమిటీలో 32 మంది సభ్యులు ఈ రోజు సమావేశానికి హాజరయ్ 2021–22 సంవత్సరంలో చేపట్టిన కార్యక్రమాలను సభ్యుల ముందు ఉంచారు. అలాగే 2022–23 విద్యా సంవత్సరానికి సంబంధించిన అకడమిక్‌ కార్యకలాపాలు, తదితర 50 అంశాలపై చర్చించి, సభ్యులంతా ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు.

నూతన విద్యా పాలసీకి అనుగుణంగా యూనివర్సిటీ అనుబంధ కాలేజీలన్నింటిలోనూ నాలుగేళ్ల డిగ్రీ కోర్సు అమలుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. మూడు ఏళ్లు పూర్తయ్యాక పదినెలల ఇంటర్న్‌షిప్‌ ఉండేలా సిలబస్‌ను రూపొందించనున్నారు. దీనిని 2022–23 విద్యా సంవత్సరం నుంచే అమలు చేయాలని నిర్ణయించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular