fbpx
HomeAndhra Pradeshఏపీలో జూన్ 20వ తేదీ వరకు కర్ఫ్యూ పొడిగింపు

ఏపీలో జూన్ 20వ తేదీ వరకు కర్ఫ్యూ పొడిగింపు

AP-CURFEW-EXTENDED-AGAIN-TILL-JUNE-20TH

అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ లో గత నెల రోజులుగా కర్ఫ్యూ కొనసాగుతోంది. పెరుగుతున్న కోవిడ్ కేసుల నియంత్రణ కోసం ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. ఈ చర్యల్లో భాగంగా ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా అమలులో ఉన్న కర్ఫ్యూను మరో పది రోజులపాటు పొడిగిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

తాజాగా ఈ కర్ఫ్యూను జూన్‌ 20 వరకు కర్ఫ్యూను పొడిగించింది. జూన్‌ 11 నుండి ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 వరకు కర్ఫ్యూ సడలింపు సమయాన్ని పెంచింది ప్రభుత్వం. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రభుత్వ కార్యాలయాలు పని చేస్తాయని తెలిపింది.

కోవిడ్‌ నివారణ చర్యలపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం తాడేపల్లిలోని తన క్యాంప్‌ కార్యాలయంలో సమీక్ష చేపట్టారు. సమీక్షకు డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, కోవిడ్‌ టాస్క్‌ఫోర్స్‌ అధికారులు హాజరయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం అమల్లో ఉన్న కర్ఫ్యూ గడువును మరో పది రోజులపాటు కర్ఫ్యూ పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular