fbpx
HomeAndhra Pradeshఆంధ్రప్రదేశ్ లో తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు!

ఆంధ్రప్రదేశ్ లో తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు!

AP-COVID-CASES-DECLINE

అమరావతి: దేశంలో కరోనా మహమ్మారి రెండవ వేవ్ ఇప్పుడిప్పూడే తగ్గుతూ రోజువారి పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టాయి. అలాగే గడచిన 24 గంటల్లో ఏపీ‌లో 91,849 మందికి కోవిడ్ టెస్టులు నిర్వహించగా అందులో 4,458 మందికి కరోనా పాజిటివ్‌ ఉన్నట్లు నిర్థారణ అయ్యింది.

గత 24 గంటల్లో కరోనా వైరస్ బారిన పడి 38 మంది మరణించారు. ఈ మరణాలతో కలిపి రాష్ట్రం మొత్తం మరణాల సంఖ్య 12,528 కు చేరుకుంది. గత 24 గంటల్లో 6,313 మంది కోవిడ్‌ నుంచి కోలుకుని క్షేమంగా డిశ్చార్జ్‌ అవ్వగా, ఇప్పటివరకు 18 లక్షల 08 వేల 262 మంది డిశ్చార్జ్‌ అయ్యారు.

ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బుధవారం కరోనా కేసులపై హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. కాగా రాష్ట్రంలో ప్రస్తుతం 47,790 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో నేటి వరకు 2,15,41,485 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular