fbpx
HomeAndhra Pradeshఏపీ కేబినేట్ సమావేశం డిసెంబర్ 18న

ఏపీ కేబినేట్ సమావేశం డిసెంబర్ 18న

AP-CABINET-MEET-18TH-DECEMBER

అమరావతి: ఈ నెల డిసెంబర్ 18వ తేదీన ఉదయం 11 గంటలకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం అమరావతిలో జరగనుంది. వెలగపూడి లోని తాత్కాలిక సచివాలయం ఒకటో బ్లాకు లోని కేబినెట్‌ సమావేశ మందిరంలో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్ ‌మోహన్‌ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకుంటారు.

ఈ కేబినెట్‌ సమావేశానికి సంబందించి అవసరమైన అజెండా అంశాలను త్వరగా పంపించాలని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీమతి నీలం సాహ్ని అన్ని శాఖల అధిపతులకు సర్క్యులర్‌ను జారీ చేశారు.

ఈ నెల 15 వ తేదీ నాటికి నివర్‌ తుపాను వల్ల వాటిల్లిన నష్టాలపై తుది నివేదిక అందనున్న నేపథ్యంలో వ్యవసాయ, ఉద్యాన పంటలు దెబ్బతిన్న రైతులకు పెట్టుబడి రాయితీ (ఇన్‌పుట్‌ సబ్సిడీ) విడుదలతో పాటు వివిధ ముఖ్యమైన అంశాలపై మంత్రివర్గ సమావేశంలో చర్చ జరుగుతుందని సమాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular