fbpx
Monday, April 29, 2024
HomeMovie Newsడైరెక్టర్ గా మారబోతున్న వరలక్ష్మి శరత్ కుమార్

డైరెక్టర్ గా మారబోతున్న వరలక్ష్మి శరత్ కుమార్

VaralakshiSaratkumar DebutDirectional MovieLaunch

కోలీవుడ్: తెలుగు సినిమా ఇండస్ట్రీ లో పెద్దగా తెలియకపోవచ్చు గాని తమిళ్ వాల్లకి వరలక్ష్మి శరత్ కుమార్ సుపరిచితమైన పేరే. శరత్ కుమార్ వారసురాలిగా ఇండస్ట్రీ లోకి వచ్చి వివిధ క్యారెక్టర్ లని చేసుకుంటూ తన నటనకి మంచి ప్రశంసలే పొందుతుంది. తెలుగు లో కూడా సందీప్ కిషన్ నటించిన ‘రామ కృష్ణ తెనాలి BA LLB ‘ సినిమాలో విలన్ గా నటించింది. అలాగే పందెంకోడి -2 సినిమాలో కూడా ఈ అమ్మాయి విలన్ గా నటించింది. లేడీ ఓరియెంటెడ్ కొంచెం వెయిట్ ఉన్న పాత్రలు చాలా వరకు వరలక్ష్మి శరత్ కుమార్ దగ్గరికి వస్తున్నాయి.

ప్రస్తుతం ఈ హీరోయిన్ దర్శకురాలిగా కొత్త అవతారం ఎత్తబోతుంది. ‘కన్నా మూచి’ అనే సినిమా ద్వారా దర్శకురాలిగా తొలి అడుగు వేయబోతుంది. ఈ విషయాన్ని సాయి పల్లవి తన ట్విట్టర్ ద్వారా ప్రకటిస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదల చేసింది. ఈ సినిమాని ‘శ్రీ తేనాండాల్ ఫిలిమ్స్’ బ్యానర్ పై ఎన్ రాధ ,రామనారాయణన్ మరియు ఎన్ రామస్వామి కలిసి నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి తమిళ్ లో మంచి మ్యూజిక్ ఇస్తున్న ఖైదీ ఫేమ్ ‘సామ్ సి ఎస్’ సంగీతం అందిస్తున్నాడు. ప్రస్తుతానికి ఈ సినిమాని కేవలం తమిళ్ లో మాత్రమే ప్లాన్ చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular