fbpx
HomeAndhra Pradeshగ్రామ వార్డు సచివాలయాలకు రేపటితో ఏడాది

గ్రామ వార్డు సచివాలయాలకు రేపటితో ఏడాది

ONE-YEAR-FOR-SACHIVALAYAM-AP

విజయవాడ : గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ ఆంధ్రప్రదేశ్‌లో ప్రారంభిమయ్యి ఈ శుక్రవారంతో తొలి ఏడాది పూర్తవుతుందని పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. రాష్ట్రంలో ప్రతి ఇంటి ముందుకు ప్రభుత్వ పాలనను తీసుకెళ్లాలి అనే ముఖ్య ఉద్దేశంతో ఈ సచివాలయ వ్యవస్థ ప్రారంభించడం జరిగింది అని తెలిపారు.

గురువారం విజయవాడలో ఆయన మాట్లాడుతూ, ‘అవినీతికి తావు లేకుండా 543 సేవలను ఈ రోజు గ్రామ వార్డు సచివాలయాల ద్వారా ప్రజలకు అందిస్తున్నాం. అవినీతి రహిత పాలనను ఈ ప్రభుత్వం అందిస్తోంది. సచివాలయ పనితీరుని మన దేశ ప్రధాని నరేం‍ద్రమోదీ కూడా ఈ మధ్యనే అభినందించారు. కేంద్ర క్యాబినెట్ సెక్రటరీ కూడా ప్రత్యేకంగా మన సచివాలయ వ్యవస్థని మెచ్చుకున్నారు.

ప్రతిష్ఠాత్మకమైన యూపీఎస్సీ ట్రైనింగ్ సెంటర్ లో ఒక పాఠ్యాంశంగా మన సచివాలయ వ్యవస్థని చేర్చారు. 61,65,000ల మందికి పెన్షన్లు గత నెల సెప్టెంబర్ వరకు ఇస్తున్నాం. 34,907 మందిని గత నెల కొత్తగా పెన్షన్ ఇచ్చే జాబితాలో చేర్చాం. గత ప్రభుత్వం లాగా కాకుండా మా ప్రభుత్వంలో ఈ పెన్షన్‌ల ప్రక్రియ నిరంతరం కొనసాగుతుంది అని అన్నారు.

1,26,200 మంది శాశ్వత ఉద్యోగులుగా ఇప్పటికే ఈ గ్రామ వార్డు సచివాలయల్లో పనిచేస్తున్నారు. 4 లక్షల పైచిలుకు ఉద్యోగాలు ఇచ్చిన ఘనత మా ప్రభుత్వానిది. రేపు గ్రామ సచివాలయ ఉద్యోగులను అభినందించేందుకు సాయంత్రం 7 గంటలకు అందరూ ఇంటి బయటకు వచ్చి చప్పట్లు కొట్టి తమ అభినందనలు తెలియజేయాలని కోరుతున్నాను. ప్రజలందరూ దీనిని పాటించాలని కోరుతున్నట్లు ఆయన ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular