fbpx
HomeBusinessప్రభుత్వ రంగ బ్యాంకుల సంఖ్య కుదింపు?

ప్రభుత్వ రంగ బ్యాంకుల సంఖ్య కుదింపు?

decrease-number-of-government-banks

న్యూఢిల్లీ: బ్యాంకింగ్ రంగం లో సమగ్ర మార్పులో భాగంగా ప్రభుత్వ యాజమాన్యంలోని రుణదాతల సంఖ్యను కేవలం ఐదుకి తగ్గించడానికి, ప్రభుత్వ యాజమాన్యంలోని సగం కంటే ఎక్కువ బ్యాంకులను ప్రైవేటీకరించాలని ప్రభుత్వం చూస్తున్నట్లు ప్రభుత్వం మరియు బ్యాంకింగ్ వర్గాలు తెలిపాయి.

ఈ ప్రణాళికలో మొదటిగా బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, యూకో బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర మరియు పంజాబ్ & సింధ్ బ్యాంక్ లలో మెజారిటీ వాటాను విక్రయించడం, ఈ ప్రభుత్వ యాజమాన్యంలోని రుణదాతల యొక్క ప్రైవేటీకరణకు దారితీస్తుందని ఒక ప్రభుత్వ అధికారి తెలిపారు.

కేంద్ర ప్రభుత్వం ఆలోచన ప్రకారం కేవలం “4-5 ప్రభుత్వ యాజమాన్యంలోని బ్యాంకులు చాలు” అని ఒక సీనియర్ ప్రభుత్వ అధికారి తెలిపారు. ప్రస్తుతం, భారతదేశంలో 12 ప్రభుత్వ రంగ బ్యాంకులు ఉన్నాయి. ప్రభుత్వం ప్రస్తుతం రూపొందిస్తున్న కొత్త ప్రైవేటీకరణ ప్రతిపాదనలో ఇటువంటి ప్రణాళికను రూపొందిస్తున్నారని, దీనిని ఆమోదం కోసం కేబినెట్ ముందు ఉంచాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిస్తోంది.

కరోనా వైరస్ మహమ్మారి వల్ల ఏర్పడిన ఆర్థిక నష్టాల నుండి దేశం బయటపడాలంటే నాన్-కోర్ కంపెనీలు మరియు ఆ రంగాలలో ఆస్తులను అమ్మడం ద్వారా డబ్బును సేకరించడానికి సహాయపడే ప్రైవేటీకరణ ప్రణాళికపై ప్రభుత్వం కృషి చేస్తోంది.

భారతదేశంలో ఐదు కంటే ఎక్కువ ప్రభుత్వ ఆధీనంలోని బ్యాంకులు ఉండకూడదని పలు ప్రభుత్వ కమిటీలు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) సిఫారసు చేశాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular