fbpx
HomeAndhra Pradeshస్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ప్రకటించిన వైఎస్సార్‌సీపీ!

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ప్రకటించిన వైఎస్సార్‌సీపీ!

YSRCP-ANNOUNCES-MLC-CANDIDATES-FOR-LEGISLATIVE-ASSEMBLY

అమరావతి: ఏపీలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ ఇటీవలే విడుదలైంది. ఈ నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ 11 మంది అభ్యర్థుల పేర్లను ఇవాళ ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు.

కాగా ఇప్పుడు ఏపీ శాసన మండలిలో 18 మంది వైఎస్సార్‌సీపీ సభ్యులు ఉన్నారని, వారిలో 11 మంది బీసీ, ఎస్సీ, మైనార్టీ వర్గాలకు చెందినవారే ఉన్నారని చెప్పారు. ఇప్పుడిస్తున్న 14 స్థానాలతో కలిపి మొత్తం 32 స్థానాల్లో 18 మంది సభ్యులు బీసీ, ఎస్సీ, మైనార్టీలు ఉన్నారని ఆయన అన్నారు.

ఏపీలో శాసనమండలి పదవుల్లో కూడా సామాజిక న్యాయం పాటిస్తున్న ఘనత పార్టీ అధ్యక్షులు, సీఎం జగన్‌కే దక్కిందని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. సీనియర్‌ నాయకులతో చర్చించి ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లను సీఎం ఖరారు చేశారని తెలిపారు. ఎమ్మెల్యే కోటా కింద వచ్చే మూడు స్థానాలకు పార్టీ అభ్యర్థుల ఎంపికలోనూ సామాజిక న్యాయం పాటించామని, పాలవలస విక్రాంత్, ఇసాక్‌ బాషా, డీసీ గోవిందరెడ్డిల పేర్లను ప్రకటించామని గుర్తు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular