fbpx
Thursday, May 2, 2024
HomeAndhra Pradeshఏపీలో పదవ తరగతి ఫలితాల విడుదల చేసిన మంత్రి!

ఏపీలో పదవ తరగతి ఫలితాల విడుదల చేసిన మంత్రి!

AP-SSC-RESULTS-RELEASED-BY-ADIMULAPU-SURESH

అమరావతి : ఇవాళ ఏపీ‌ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ పదవ తరగతి ఫలితాలను అలానే మార్క్స్ మెమోలను విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, గ్రేడ్స్ కావాలని విద్యార్థుల తల్లిదండ్రుల కోరిక మేరకు అలాగే హైపవర్‌ కమిటీ సిఫార్సుల ఆధారంగా విద్యార్థులకు వారి ప్రతిభ ఆధారంగా కేటాయించారని తెలిపారు.

కాగా రెండు విద్యా సంవత్సరాలకు సంబంధించిన గ్రేడ్లను ప్రకటించామని ఆయన అన్నారు. రాష్ట్రంలో ఏ విద్యార్థికి కూడా నష్టం వాటిల్లకుండా చర్యలు తీసుకున్నట్లు అలాగే భవిష్యత్‌లో విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకున్నట్లు మంత్రి వెల్లడించారు. 2020-21 ఫలితాలు, గ్రేడ్‌లతో పాటు 2019-20 గ్రేడ్‌లను కూడా ఆయన ఈ సందర్భంగా ప్రకటించారు.

అయితే పదవ తరగతిలి గ్రేడ్ల విధానంలో విద్యార్థుల ఉత్తీర్ణతను విడుదల చేశారు. 2019–20 విద్యా సంవత్సరంలో విద్యార్థులు రాసిన మూడు ఫార్మేటివ్‌ పరీక్షల మార్కులకు 50 శాతం వెయిటేజీని, రాసిన ఒక సమ్మేటివ్‌ పరీక్ష మార్కులకు గాను 50 శాతం వెయిటేజీని కలిపారు. మొత్తం 100 మార్కులుగా పరిగణనలోకి తీసుకుని వారు సాధించిన మార్కుల ఆధారంగా గ్రేడ్లను‌ ఇచ్చారు.

కాగా వారికి ఉన్న అన్ని సబ్జెక్టులకు ఇదే విధానాన్ని అవలంభించారు. వొకేషనల్‌ కోర్సుల విద్యార్థులకు కూడా ఇదే విధానాన్ని ఉపయోగించి గ్రేడ్లను ఇచ్చారు. 2017, 2018, 2019 సంవత్సరాల్లో ఫెయిలై ఆ తరువాత పరీక్షలకు హాజరైనవారికి వారి ఇంటర్నల్‌ మార్కులను పరిగణనలోకి తీసుకున్నారు. 20 అంతర్గత మార్కులను 5తో రెట్టింపుచేసి 100 మార్కులుగా పరిగణించి వారికి కూడా గ్రేడ్లను కల్పించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular