fbpx
Friday, April 26, 2024
HomeAndhra Pradeshఏపీలో గత 24 గంటల్లో కొత్తగా 1,746 కరోనా కేసులు!

ఏపీలో గత 24 గంటల్లో కొత్తగా 1,746 కరోనా కేసులు!

1746-COVID-CASES-IN-ANDHRAPRADESH

అమరావతి: ఏపీ‌లో కోవిడ్ మహమ్మారి పాజిటివ్ కేసులు క్రమ క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. రాష్ట్రంలో గత 24 గంటల్లో 73,341 మందికి కోవిడ్ పరీక్షలు చేయగా అందులో 1,746 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ జరిగింది. కాగా గడచిన 24 గంటలలో రాష్ట్రంలో కోవిడ్ వల్ల 20 మంది మరణించారు. ఈ మరణాలతో మొత్తం మరణాల సంఖ్య ఇప్పుడు 13,582 కు చేరింది.

అదే సమయంలో గత 24 గంటల్లో 1,648 మంది కరోనా నుండి పూర్తిగా‌ కోలుకుని క్షేమంగా డిశ్చార్జ్‌ అయ్యారు. రాష్ట్రంలో 19,58,275 మంది హాస్పిటల్ నుండి డిశ్చార్జ్‌ అయ్యారు. దీనికి సంబంధించి ఏపీ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ శుక్రవారం కరోనా హెల్త్‌ బులెటిన్‌ విడుదల అయ్యింది.

అయితే ప్రస్తుతం రాష్ట్రంలో 18,766 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. దీంతో రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 19,90,656 కు చేరింది. ఏపీలో ఇప్పటి వరకు 2,55,26,861 కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular