fbpx
HomeBig Storyప్రధాని మోడీ ప్రసంగంలో కీలక నిర్ణయాల వెల్లడి

ప్రధాని మోడీ ప్రసంగంలో కీలక నిర్ణయాల వెల్లడి

VACCINATION-FREE-FOR-ALL-PM-MODI-ASSURANCE

న్యూఢిల్లీ : చాలా రోజుల తరువాత ప్రధాని మోడీ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ఇక నుండి వ్యాక్సినేషన్‌ బాధ్యత పూర్తిగా కేంద్ర ప్రభుత్వానిదేనని, కేంద్రమే అందరికీ ఉచితంగా వ్యాక్సిన్లను పంపిణీ చేస్తుందని ప్రధాని చెప్పారు. దీనికి సంబంధించి కొత్త గైడ్‌లైన్స్‌ ఇస్తామని తెలిపారు.

ఈ రోజు సాయంత్రం ప్రధాని తొలిసారి సెకండ్‌ వేవ్‌ తర్వాత జాతినుద్ధేశించి ప్రసంగించారు. ఈ నేపథ్యంలో కోవిడ్‌ వ్యాక్సినేషన్‌పై ఆయన కొన్ని కీలక ప్రకటనలు చేశారు. ఈ నెల 21వ తేదీ నుండి 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ ఉచితంగా వ్యాక్సిన్లు అందిస్తామని ప్రకటించారు. అలాగే ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో రూ.150 మాత్రమే సర్వీస్‌ ఛార్జీ తీసుకోవాలని ఆయన ఆదేశించారు. కరోనాపై చెశ్తున్న ఈ యుద్ధంలో భారత్ ఖచ్చితంగా గెలుస్తుందని, నవంబర్‌ కల్లా దేశంలో 80 శాతం మందికి వ్యాక్సినేషన్‌ పూర్తి చేస్తామని అన్నారు.

అలాగె తన ప్రసంగంలో మరి కొన్ని వరాలు అందించారు ప్రధాని. పీఎం గరీభ్‌ కళ్యాణ్‌ అన్నదాన యోజన పథకం దేశంలో దీపావళి వరకు సాగుతుందని, పేద ప్రజలందరికీ కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు. ఎవరూ ఆకలితో బాధపడకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు. వ్యాక్సిన్లకు సంబంధించి కొందరు కావాలనే అనవస్రమైన గందరగోళం సృష్టిస్తున్నారని, అలాంటి వారిని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కరోనాకు సంబంధించిన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular