పనాజీ(గోవా): గోవా యొక్క మాజీ సీఎం మనోహర్ పారికర్ తనయుడు తను కోరినన పనాజీ అసెంబ్లీ స్థానానికి భారతీయ జనతా పార్టీ సీటు ఖరారు చేయకపోవడంతో తీవ్ర నిరాశ చెందిన ఉత్పల్ పారికర్ బీజేపీ కి గుడ్ బై చెప్పేశారు. ఇక పై అతను బీజేపీ పార్టి లో కొనసాగలేను అని శుక్రవారం తన రాజీనామా అస్త్రాన్ని ఉపయోగించారు.
ఈ నేపథ్యంలో గోవా పనాజీ స్థానం నుండే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయ బోతున్నానని ఆయన ప్రకటించారు. గత కొద్ది రోజులుగా పనాజీ స్థానాన్ని ఆశిస్తున్న మనోహర్ పారికర్ కొడుకు ఉత్పల్ పారికర్కు బీజేపీ గురువారమే పెద్ద షాక్ ఇచ్చింది.
ఆ స్థానాన్ని ఇప్పటికే ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేకు ఇవ్వడంతో ఉత్పల్కు పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్లయ్యింది. బీజేపీ అధిష్టానం తను ఆశించిన స్థానం కాకుండా సూచించిన రెండు స్థానాల నుంచి పోటీ చేయడానికి ఉత్పల్ నిరాకరించారు. అదే సమయంలో ఇక ఎంతో ముచ్చటపడుతున్న పనాజీ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా దిగాలనే యోచనలోనే బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు ఉత్పల్ వెల్లడించారు.