fbpx
Saturday, April 1, 2023

INDIA COVID-19 Statistics

44,715,786
Confirmed Cases
Updated on April 1, 2023 3:45 am
530,867
Deaths
Updated on April 1, 2023 3:45 am
15,208
ACTIVE CASES
Updated on April 1, 2023 3:45 am
44,169,711
Recovered
Updated on April 1, 2023 3:45 am
HomeTop Storiesజాగిలం తుంగా, తీరుస్తుంది పోలీసుల బెంగ

జాగిలం తుంగా, తీరుస్తుంది పోలీసుల బెంగ

TUNGA-POLICE-SNIFFER-DOG

బనశంకరి: కర్ణాటకలో ఓ పోలిసు జాగిలం తుంగా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 12 కిలోమీటర్లు పరిగెత్తి నేరస్తుదిని పట్టుకుని అందరినీ ఆశ్చర్యపరచింది. ఆ శునకాన్ని పోలీసులు సన్మానించారు కూడా.

కర్ణాటక రాష్ట్రంలోని దావణగెరె పోలీస్‌ డాగ్‌స్క్వాడ్‌లో ఉన్న తొమ్మిదేళ్ల తుంగా అనే డాబర్‌మెన్‌ శునకం రెండుగంటల్లో ఏకంగా 12 కిలోమీటర్లు వెళ్లి హంతకుడి ఆచూకీ కనిపెట్టింది. చేతన్‌ అనే వ్యక్తి తన స్నేహితుడు చంద్రానాయక్‌ తదితరులతో కలిసి ధార్వాడ జిల్లాలోని ఓ ఇంట్లో దొంగతనానికి పాల్పడ్డారు.

వారు ఈ దొంగతనంలో ఒక సర్వీస్‌ రివాల్వర్, బంగారు నగలు దోచుకెళ్లి సమానంగా పంచుకున్నారు. కానీ చంద్రానాయక్‌ తనకు వాటా ఎక్కువ కావాలని డిమాండ్‌ చేయడంతో చేతన్‌ ఆ సర్వీస్‌ రివాల్వర్‌తో అతన్ని కాల్చి చంపి పరారయ్యాడు.

ఈ విషయం తెలుసుకున్న పోలీసులు శుక్రవారం రాత్రి 9.30 గంటల సమయంలో ఘటనాస్థలాన్ని తుంగాతో కలిసి పరిశీలించారు. వాసన పసిగట్టిన తుంగా పరుగులు తీస్తూ రెండు గంటల తర్వాత కాశీపుర తాండాలో వైన్‌షాప్‌ వద్దకు వెళ్లి అక్కడ హోటల్‌ వద్ద నిలబడింది.

సమీపంలోని ఇంటి ముందుకు వెళ్లి గట్టిగా మొరగసాగింది. ఆ ఇల్లు చేతన్‌ బంధువుది కాగా, చేతన్‌ అక్కడే మొబైల్‌లో మాట్లాడుతున్నాడు. అతడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టగా చోరీ, హత్య చేసినట్లు నిజం ఒప్పుకున్నాడని డీఎస్‌పీ ప్రశాంత్‌ మున్నోళ్లి తెలిపారు.

పోలీసు జాగిలాలు సామాన్యంగా 8 కిలోమీటర్ల వరకూ వెళ్తాయి. కానీ తుంగా 12 కిలోమీటర్లు వెళ్లడం గొప్ప విషయమని కొనియాడుతూ శునకాన్ని సన్మానించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular