fbpx
HomeNationalతమిళనాడు సర్కార్ ద్వారా మరోసారి పరీక్షలు రద్దు ‌

తమిళనాడు సర్కార్ ద్వారా మరోసారి పరీక్షలు రద్దు ‌

TAMILNADU-GOVERNMENT-CANCELS-EXAMS-AMID-COVID-SECOND-PHASE

చెన్నె: దేశం మొత్తం మీద కరోనా మహమ్మారిపై ఇంకా పోరు కొనసాగుతున్న నేపథ్యంలో దక్షిణ రాష్ట్రం అయిన తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సంవత్సరం 9, 10, 11వ తరగతి విద్యార్థుల పరీక్షలను రద్దు చేసి వారిని డైరెక్ట్ గా ప్రమోట్‌ చేస్తూ ఉత్తర్వులను జారీ చేసింది.

ఈ మేరకు తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి గురువారం పరీక్షలు రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం తమిళనాడు రాష్ట్రం లో కరోనా రెండో దశ ప్రారంభమైనట్టు వైద్య నిపుణులు కొందరు చెప్తున్నారు. ప్రతిరోజూ అక్కడ పెద్ద సంఖ్యలో కేసులు నమోదవుతుండడంతో విద్యార్థుల పరీక్షలు రద్దు చేయాలని ప్రజలు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యావేత్తలు విజ్ఞప్తి చేశారు.

కాగా ఈ ప్రభుత్వ నిర్ణయంతో గత సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా విద్యార్థులు పరీక్షలు లేకుండానే తదుపరి తరగతులకు ప్రమోట్‌ అవనున్నారు. అయితే, ఆయా రాష్ట్రాల్లో ఇటీవల కరోనా కేసులు పెరుగుతుండటంతో మహారాష్ట్ర, కేరళలో కూడా హైస్కూల్‌ పరీక్షలు రద్దు చేసే అవకాశం ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular