fbpx
HomeNationalరెజ్లర్ సుషీల్ కుమార్ తీహార్‌ జైలుకు తరలింపు!

రెజ్లర్ సుషీల్ కుమార్ తీహార్‌ జైలుకు తరలింపు!

SUSHILKUMAR-SHIFTED-TO-TIHARJAIL-DUE-TO-SECURITY-REASONS

న్యూఢిల్లీ: భారత రెజ్లర్‌ సాగర్‌ ధంకర్ యొక్క హత్య కేసులో అరెస్టైన ఒలింపిక్‌ పతక విజేత అయిన రెజ్లర్ సుశీల్‌ కుమార్‌ను మండోలి జైలు నుంచి తీహార్‌ జైలుకు బదిలీ చేశారు. సుశీల్‌ ‌తో పాటు అతని సహచరుడు అయిన అజయ్‌ను కూడా మే 23న ఢిల్లీ స్పెషల్‌ పోలీసులు దేశ రాజధానిలోని ముండ్కా ప్రాంతంలో అరెస్టు చేశారు.

కాగా, కొన్ని భద్రతా కారణాల వల్ల సుశీల్‌ను తిహార్‌ జైలు-2కు తరలించినట్లు తెలుస్తోంది. కానీ జైలు అధికారులు మాత్రం అతన్ని సాధారణ ప్రక్రియలో భాగంగానే తరలింపు చేశామని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే, ఢిల్లీలోని ఛత్రసాల్‌ స్టేడియం వద్ద మే 4న సాగర్‌తో పాటు అతని స్నేహితులు సోను, అమిత్‌ కుమార్‌పై సుశీల్‌ కుమార్‌, అతని స్నేహితులు దాడి చేసినట్లు ఆరోపణలున్నాయి.

ఆ గొదవలో తీవ్ర గాయాలు అవడంతో సాగర్‌ ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. ఈ దాడి జరిగిన తరువాత పరారీలో ఉన్న సుశీల్‌ కుమార్‌తో పాటు సహ నిందితుడు అజయ్‌ కుమార్‌ను పోలీసులు మే నెలలో అరెస్టు చేశారు. వీరిద్దరూ బెయిల్‌ కోసం దరఖాస్తు చేయగా కోర్టు వాటిని తిరస్కరించింది. ఇదే కేసులో సుశీల్‌ జూడో కోచ్‌ను సైతం పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular