fbpx
HomeMovie Newsమరో రెండు సినిమాలు ప్రకటించిన శర్వానంద్

మరో రెండు సినిమాలు ప్రకటించిన శర్వానంద్

Sharwanand Multiple MovieAnnouncments

టాలీవుడ్: తెలుగు యువ హీరో శర్వానంద్ సినిమాల జోరు చూపిస్తున్నాడు. శర్వా హీరో గా రూపొందిన ‘శ్రీకారం‘ ఈ వారం విడుదల అవనుంది. ఈ సినిమాతో పాటు RX100 డైరెక్టర్ అజయ్ భూపతి దర్శకత్వం లో మహా సముద్రం అనే సినిమా షూటింగ్ శర వేగంగా జరుగుతుంది. ఈ సినిమా ఆగష్టు వరకు విడుదలకి సిద్ధం అవుతుంది. ఇవే కాకుండా మరో రెండు సినిమాలని ప్రకటించాడు శర్వానంద్. ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న శర్వానంద్ కి బర్త్ డే విషెస్ తెలియ చేస్తూ ఈ రెండు కొత్త సినిమాల నిర్మాతలు ప్రకటనలు విడుదల చేసారు.

‘నేను శైలజ’, ‘ఉన్నది ఒక్కటే జిందగీ’, ‘చిత్ర లహరి’, ‘రెడ్’ లాంటి సినిమాలని రూపొందించిన కిషోర్ తిరుమల దర్శకత్వంలో ‘ఆడవాళ్ళూ మీకు జోహార్లు’ అనే సినిమాలో నటించనున్నట్టు ఈరోజు తెలిపారు. లవ్ ఎంటర్టైనర్ మరియు రెడ్ సినిమాతో థ్రిల్లర్ జానర్ ని టచ్ చేసిన కిషోర్ ఈ సినిమాతో ఫామిలీ మరియు ఎమోషనల్ కంటెంట్ తో రాబోతున్నట్టు టైటిల్ చూస్తే అర్ధం అవుతుంది. శ్రీ లక్ష్మి వెంకటేశ్వరా సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చేకూరి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇదే కాకుండా డ్రీం వారియర్ పిక్షర్స్ బ్యానర్ లో శర్వానంద్ నటించబోయే 30 వ సినిమా రూపొందనున్నట్టు ఒక పోస్టర్ విడుదల చేసారు. ఈ సినిమా టైటిల్ మరియు మిగతా వివరాలు మరి కొన్ని రోజుల్లో ప్రకటించనున్నట్టు తెలియచేసారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular