fbpx
Tuesday, April 30, 2024
HomeMovie Newsబహుభాషా చిత్రంగా సందీప్ కిషన్ 'మాయవన్' సీక్వెల్

బహుభాషా చిత్రంగా సందీప్ కిషన్ ‘మాయవన్’ సీక్వెల్

SandeepKishan MayavanSequel Announcement

కోలీవుడ్: సందీప్ కిషన్ హీరోగా 2017 వ సంవత్సరంలో ‘మాయవన్‘ అనే డ్రగ్ రిలేటెడ్ థ్రిల్లర్ మూవీ తమిళ్ లో రూపుదిద్దుకుంది. ఈ సినిమాని తెలుగు లో ‘ప్రాజెక్ట్ Z ‘ అనే పేరుతో విడుదల చేసారు. తమిళ్ లో పరవాలేదనిపించిన ఈ సినిమా తెలుగులో అస్సలు ప్రొమోషన్ లేకుండా విడుదల చేయడం తో ఈ సినిమా వచినట్టులు కూడా తెలుగు ప్రేక్షకులకి పెద్దగా తెలియదు. ఈ సినిమాని తెలుగు లో హీరో సందీప్ కి తెలియకుండానే, సందీప్ డబ్బింగ్ లేకుండానే విడుదల చేసారు. అప్పట్లో ఈ సినిమా పైన హీరోకి, నిర్మాతకి చిన్న వివాదం కూడా తలెత్తింది.

ప్రస్తుతం ఈ సినిమాకి సీక్వెల్ రూపొందిస్తున్నట్టు ఈ సినిమా డైరెక్టర్ ప్రకటించారు. సందీప్ కిషన్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాని ప్రకటించారు. మాయావన్ కి సీక్వెల్ గా రూపుదిద్దుకోబోతున్న ఈ సినిమాని తెలుగు మరియు తమిళ్ భాషల్లో రూపొందించి విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు డైరెక్టర్. ‘మాయవన్ -రీ లోడెడ్’ అనే పోస్టర్ విడుదల చేసి సందీప్ కి బర్త్ డే విషెస్ చెప్తూ ఈ సినిమాని ప్రకటించాడు. సి.వీ. కుమార్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందనుంది. మొదటి పార్ట్ ని రూపొందించిన సి.వీ.కుమార్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా గురించి మిగతా వివరాలు మరికొద్దిరోజుల్లో తెలియాల్సి ఉంది.

https://twitter.com/icvkumar/status/1390512098577289223

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular