fbpx
HomeBusinessమళ్ళీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

మళ్ళీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

PETROL-DIESEL-PRICES-HIKED

సాక్షి: గత కొన్ని రోజులుగా పెరుగుదల నమోదు చేస్తున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలకు మరోసారి రెక్కలు వచ్చాయి. తాజాగా ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర 27 పైసలు బలపడి రూ. 83.13కు చేరింది. డీజిల్‌ ధర సైతం లీటర్‌కు 25 పైసలు అధికమై రూ. 73.32ను తాకింది. ఈ బాటలో కోల్‌కతాలో డీజిల్‌ ధరలు లీటర్‌కు రూ. 76.89కు చేరగా.. పెట్రోల్‌ రేటు రూ. 84.63ను తాకింది.

దీనితో దేశంలోని ఇతర ప్రాంతాలలోనూ పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పన్నులు తదితరాల ఆధారంగా పెంపునకు లోనుకానున్నట్లు పరిశ్రమ వర్గాలు తెలియజేశాయి. అయితే 48 రోజుల తదుపరి మళ్లీ నవంబర్‌ 20న దేశీయంగా పెట్రోల్‌ ధరలకు రెక్కలొచ్చిన విషయం విదితమే. అప్పటినుంచీ విదేశీ మార్కెట్లో ముడిచమురు ధరలు బలపడుతుండటంతో దేశీయంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరుగుతున్నట్లు నిపుణులు వ్యాఖ్యానించారు.

తాజా సమావేశంలో భాగంగా రష్యా సహా ఒపెక్‌ దేశాలు ఉత్పత్తిలో కోతలను 2021 జనవరి తదుపరి సైతం కొనసాగించేందుకు అంగీకరించడంతో ముడిచమురు ధరలు పెరుగుదల నమోదు చేస్తున్నాయి. వెరసి శుక్రవారం లండన్‌ మార్కెట్లో బ్రెంట్‌ బ్యారల్‌ 1.2 శాతం ఎగసింది. 49.25 డాలర్లను తాకింది. న్యూయార్క్‌ మార్కెట్లో నైమెక్స్‌ చమురు సైతం 1.4 శాతం జంప్‌చేసి 46.26 డాలర్లకు చేరింది.

విదేశీ ధరల ప్రభావంతో ప్రభుత్వ రంగ చమురు దిగ్గజాలు ఐవోసీ, బీపీసీఎల్‌, హెచ్‌పీసీఎల్‌ ఇటీవల పెట్రోల్‌, డీజిల్‌ ధరలను పెంచుతూ వస్తున్నట్లు పరిశ్రమవర్గాలు పేర్కొన్నాయి. విదేశీ మార్కెట్లలో ముడిచమురు ధరల ఆధారంగా దేశీయంగా పెట్రో ఉత్పత్తుల ధరలను ఆయిల్‌ మార్కెటింగ్ కంపెనీలు సవరిస్తుంటాయి. రెండు వారాల సగటు ధరలు, రూపాయి మారకం తదితర అంశాలు ఇందుకు పరిగణిస్తుంటాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular