fbpx
HomeNationalన్యాయవాదికి మాస్కు లేదని కేసు వాయిదా వేసిన జడ్జి!

న్యాయవాదికి మాస్కు లేదని కేసు వాయిదా వేసిన జడ్జి!

NO-MASK-NO-ENQUIRY-SAYS-MUMBAI-HIGHCOURT

ముంబై‌: ముంబై న్యాయస్థానం లో ఒక అరుదైన చర్య జరిగి అందరిని ఆకర్షించింది. ఒక న్యాయవాది తాను వాదించ బోయే కేసును విచారించేందుకు ముంబై హైకోర్టు అడ్డు చెప్పింది. దీనికి కారణం ఏంటనుకుంటున్నారా? ఆ న్యాయవాది కోర్టులో మాస్క్‌ వాడకుండా తన వాదనను వినిపించేందుకు ముందుకు రావడమే!

మాస్క్‌ లేకుంటే విచారణ లేదు అని ముంబ్బై కోర్టు తేల్చి చెప్పేసింది. హైకోర్టుకు చెందిన సింగిల్‌ బెంచీ న్యాయమూర్తి పృథ్వీరాజ్‌ చవాన్‌ ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. న్యాయస్థానంలో ఒక కేసు విచారణ సందర్భంగా న్యాయవాది తన వాదనలు వినిపించేందుకు మాస్క్‌ను తొలిగించి వాదనలకు ఉపక్రమించాడు. అది గమనించిన జస్టిస్‌ చవాన్‌ వెంటనే స్పందించి, ఆ న్యాయవాది వాదించే కేసును విచారించడానికి నో చెబుతూ మరో కొత్త తేదిని ప్రకటించారు.

క్రితం విధించిన దేశవ్యాప్త లాక్‌డౌన్‌ కాలంలో కోర్టులు ఆన్‌లైన్‌లోనే కేసుల్ని విచారించాయి. ఈటీవలే కోర్టులు భౌతికంగా న్యాయవిచారణను తిరిగి చేపట్టాయి. అదే సమయంలో కరోనా నిబంధనల ను అనుసరించి తీరాలనీ తీర్మానించారు. ఈ ఎస్‌ఓపీఎస్‌ ప్రకారం కోర్టులో న్యాయవాదులతో సహా ప్రతి ఒక్కరు మాస్క్‌ ధరించడం అనివార్యం చేశారు.

ఈ సందర్భంగా జస్టిస్‌ పథ్వీరాజ్‌ చవాన్‌ మాట్లాడుతూ, ‘కోర్టులో న్యాయ విచారణ చేపట్టినప్పుడు ఆ కేసుకు సంబంధించిన వారు మాత్రమే కోర్టు హాలులో ఉండాలనీ, మిగతా న్యాయవాదులంతా పక్క రూమ్‌లో తమ వంతు వచ్చే వరకు ఎదురు చూడాలి, కేసు విచారణ సమయంలో సబార్డినేట్‌లు వాదిస్తున్నప్పుడు కోర్టులో ఉన్న సీనియర్‌ న్యాయమూర్తులు కూడా మాస్క్‌లు తప్పనిసరిగా ధరించాల్సిందే’ అని తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular