fbpx
HomeMovie Newsరానా 'విరాట పర్వం' లో నివేథా పేతురాజ్

రానా ‘విరాట పర్వం’ లో నివేథా పేతురాజ్

NivethaPethuraj ForACrucialRoleIn RanaViraataParvam

టాలీవుడ్: శ్రీ విష్ణు హీరో గా నటించి 2018 లో విడుదలైన సినిమా ‘నీది నాది ఒకే కథ’. ఈ సినిమా ద్వారా వేణు ఊడుగుల దర్శకుడిగా ఇండస్ట్రీ కి పరిచయం అయ్యాడు. ఈ సినిమా కలెక్షన్స్ పరంగా నిరాశ పరచినా కానీ కంటెంట్ పరంగా విమర్శకుల ప్రశంసలు పొందింది. ఈ సినిమా ద్వారా వేణు చాల మంచి పేరు తెచ్చుకున్నాడు. వెంటనే రానా తో సినిమా చేసే అవకాశం వచ్చింది. రెండవ సినిమానే రానా తో చేస్తున్నాడు. పెద్ద హీరో అని కమర్షియల్ కథని ఎంచుకోకుండా నక్సలైట్ బ్యాక్ డ్రాప్ ఉన్న ఒక సోషల్ కాజ్ ఉన్న కథని ఎంచుకుని తన మార్గంలోనే వెళ్తున్నాడు. ఈ సినిమా పైన కంటెంట్ పరంగా అంచనాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. ఇప్పటికి విడుదలైన ఫస్ట్ లుక్ ఆకట్టుకున్నాయి.

ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ అని అనడం కన్నా మరో ప్రధాన పాత్రలో నటిస్తుంది అని చెప్పుకోవచ్చు. ప్రియమణి కూడా ఇంకో పాత్రలో నటిస్తుంది. ఇప్పుడు మరో పాత్ర కోసం ‘మెంటల్ మదిలో’, ‘బ్రోచేవారెవరురా’ , ‘ఆలా వైకుంఠపురం లో ‘ లాంటి సినిమాల ద్వారా ఆకట్టుకున్న తమిళ్ హీరోయిన్ ‘నివేథా పేతురాజ్‘ ని ఎంచుకున్నారు. ఈ విషయాన్నీ దర్శకుడు వేణు ఊడుగుల అధికారికంగా ప్రకటించారు. ఒక ప్రత్యేక పాత్ర కోసం నివేథా పేతురాజ్ ని ఈ సినిమాలో నటింపచేస్తున్నాం అని తెలియచేసాడు. శ్రీ లక్ష్మి వెంకటేశ్వరా సినిమాస్ మరియు సురేష్ ప్రొడక్షన్స్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ చాలా వరకు పూర్తి అయింది. కరోనా వల్ల గ్యాప్ తీసుకున్న సినిమా టీం మిగిలిన భాగం కూడా పూర్తి చేసి విడుదల చేసే ప్లాన్ లో ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular