fbpx
HomeNationalసత్యా నాదెళ్ళ, మైక్రోసాఫ్ట్ నూతన ఛైర్మన్

సత్యా నాదెళ్ళ, మైక్రోసాఫ్ట్ నూతన ఛైర్మన్

NADELLA-ELECTED-AS-MICROSOFT-NEW-CHAIRMAN

న్యూఢిల్లీ: సత్య నాదెళ్ళ మైక్రోసాఫ్ట్ సీఈవో గా బధ్యతలు చేపట్టి ఇప్పటికే చరిత్ర సృష్టించారు. తాజాగా తెలుగు తేజం సత్య నాదెళ్ల మరో పెద్ద ఘనత సాధించారు. ప్రపంచ టెక్‌ దిగ్గజం అయిన మైక్రోసాఫ్ట్ నూతన ఛైర్మన్‌గా సత్య నాదెళ్ల నియమితులయ్యారు.

మైక్రోసాఫ్ట్ కు ప్రస్తుత ఛైర్మన్‌ గా ఉన్న జాన్‌ తాంసన్‌ స్థానంలో, ప్రస్తుత చీఫ్ నే కొత్త ఛైర్మన్‌గా కంపెనీ యొక్క బోర్డు ఎంపిక చేసింది. 2014 లో మైక్రోసాఫ్ట్ కు‌ సీఈవోగా బాధ్యతలు స్వీకరించిన సత్య నాదెళ్ల, మైక్రోసాఫ్ట్‌ ప్రాజెక్ట్‌ అభివృద్ధిలో తనవంతు కీలకపాత్ర పోషించారు.

అయితే మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు అయిన బిల్ గేట్స్ తరువాత చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన తాంసన్‌ లీడ్ ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తారని కంపెనీ తెలిపింది. స్టీవ్ బాల్‌మెర్ నుండి 2014 లో సీఈవోగా బాధ్యతలు స్వీకరించిన నాదెళ్ల, లింక్డ్ఇన్, న్యూయాన్స్ కమ్యూనికేషన్స్, జెనిమాక్స్ లాంటి బిలియన్ డాలర్ల కొనుగోళ్లు, అనేక డీల్స్‌తో మైక్రోసాఫ్ట్‌ వృద్దిలో కీలకపాత్ర పోషించారు.

కాగా దాతృత్వ పనుల నిమిత్తం బోర్డు నుంచి వైదొలగుతానని బిల్‌గేట్స్‌ ప్రకటించిన సంవత్సరం తరువాత ఉన్నత స్థాయి కీలక ఎగ్జిక్యూటివ్‌ల మార్పులు జరిగాయి. ఇంకోవైపు బిల్‌గేట్స్‌ విడాకులు, ఉద్యోగితో గేట్స్ సంబంధాలపై దర్యాప్తు జరిపినట్లు కంపెనీ గత నెలలో ప్రకటించింది. అయితే గేట్స్‌ను బోర్డునుంచి తొలగిస్తారా లేదా అనే దానిపై స్పందించడానికి మైక్రోసాఫ్ట్ నిరాకరించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular