fbpx
Tuesday, April 23, 2024
HomeBusinessముఖేష్ అంబానీ సంపద భారీగా పెరుగుదల!

ముఖేష్ అంబానీ సంపద భారీగా పెరుగుదల!

MUKESH-PROPERTY-VALUE-RISES-HEAVILY

ముంబై: అసియాలోనే అతిపెద్ద ధనవంతుడైన ముఖేష్ అంబానీ సంపద ఇవాళ భారీగా పెరిగింది. ముఖేష్ సంపద కేవలం ఒకే ఒక్క రోజులోనే 3.71 బిలియన్ డాలర్ల మేర పెరుగుదల నమోదు చేసింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ల ధరలు భారీగా పెరగడమే దీనికి ప్రధాన కారణం అని సమాచారం.

ఇటీవల రిలయన్స్ కంపెనీ యొక్క షేర్ల విలువ భారీగా పెరిగిన నేపథ్యంలో ముఖేష్ అంబానీ 100 బిలియన్ డాలర్లకు పైగా నికర విలువతో బిలియనీర్ల ప్రత్యేక క్లబ్ లోకి ప్రవేశించడానికి అతి చేరువలో ఉన్నారు. బ్లూమ్ బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం అంబానీ తన నికర ఆస్తుల విలువ 92.6 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ప్రపంచంలోని అత్యంత ధనవంతుల జాబితాలో అంబానీ 12వ స్థానంలో కొనసాగుతున్నాడు.

కాగా రిలయన్స్ షేర్లు సోమవారం (అనగా సెప్టెంబర్ 6) బీఎస్ఈలో 1.70 శాతం పెరిగి రూ.2,429.00 వద్ద ఉన్నాయి. గత వారం, స్ట్రాండ్ లైఫ్ సైన్సెస్ లో రూ.393 కోట్ల వాటాను రిలయన్స్ స్ట్రాటజిక్ బిజినెస్ వెంచర్స్ లిమిటెడ్ కొనుగోలు చేసినట్లు ప్రకటించింది.

భారత లోకల్‌ సెర్చింజన్‌ అయిన జస్ట్‌ డయల్‌లో రిలయన్స్ రిటైల్ 40.95% వాటాను ఇటీవలే కొనుగోలు చేసింది. ఇక జియో ఇన్ఫోకామ్ అతి తక్కువ టారీఫ్లకు ఇంటర్నెట్ అందిస్తూ పోటీదారులకు చుక్కలు చూపిస్తోంది. ప్రస్తుతం జియో భారతదేశంలో అతిపెద్ద వైర్ లెస్ సర్వీస్ ప్రొవైడర్ గా ఉంది. 2021, జూన్ చివరి నాటికి 43.66 కోట్ల మంది చందాదారులను కలిగి ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular