fbpx
HomeBig Storyప్రపంచ మార్కెట్లను ఆకర్షించే స్థాయి భారత్ కు ఉంది

ప్రపంచ మార్కెట్లను ఆకర్షించే స్థాయి భారత్ కు ఉంది

MIC-POMPEO-INDIA-IDEAS-SUMMIT

వాషింగ్టన్‌: అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో చైనా విభేధాల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికాతో పాటు ప్రపంచంలోని చాలా దేశాల నమ్మకం చూరగొన్న భారత్‌కు చైనా నుంచి వెళ్ళిపోతున్న అంతర్జాతీయ స్థాయి కంపెనీలను ఆకర్షించగల సత్తా ఉందని పేర్కొన్నారు.

అలాగే వాణిజ్య అవసరాల కోసం భారత్‌ చైనాకు సంబందించిన కంపెనీలపై ఆధారపడటం తగ్గించుకోవాలని, అప్పుడే చైనీస్‌ కమ్యూనిస్టు పార్టీ సృష్టిస్తున్న అడ్డంకులన్య్ సులభంగా అధిగమించవచ్చని అభిప్రాయపడ్డారు.

ఈ మేరకు ఆయన బుధవారం జరిగిన యూఎస్‌-ఇండియా బిజినెస్‌ కౌన్సిల్‌(యూఎస్‌ఐబీసీ)- ‘‘ఇండియా ఐడియాస్‌ సమ్మిట్‌’’లో వర్చువల్‌ సమావేశంలో పాంపియో కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్య దేశాలైన అమెరికా- భారత్‌ కలిసి పనిచేస్తే ఎంతో బాగుంటుందని, అయితే అనుకున్న లక్ష్యాలు సాధించాలంటే పెట్టుబడులు పెట్టేందుకు భారత్‌ ఇంకా సానుకూల, స్నేహపూరితమైన వాణిజ్య వాతావరణం కల్పించాల్సి ఉంటుందన్నారు.

భారత్ తో తాము కేవలం ద్వైపాక్షిక సంబంధాలకే పరిమితం కాబోమని, తమకు ఉన్న అతికొద్ది నమ్మకమైన, ఒకే ఆలోచనా విధానం కలిగిన దేశాల్లో భారత్‌ కూడా ఒకటి అంటూ ప్రశంసలు కురిపించారు. భారత్‌తో బంధాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు సుముఖంగా ఉన్నామని.. జీ-7 సదస్సుకు భారత ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానించిన విషయాన్ని ఈ సందర్భంగా పాంపియో గుర్తు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular