fbpx
HomeMovie News2022 లో మణి రత్నం సినిమా

2022 లో మణి రత్నం సినిమా

ManiRatnam Movie Update

కోలీవుడ్: సౌత్ లో ఉన్న ప్రతీ సినిమా ఇండస్ట్రీ లో ఉన్న ప్రతీ నటుడు, ప్రతీ టెక్నీషియన్ పని చేయాలనుకునే దర్శకుడు మణి రత్నం. ఆయన నుంచి సినిమా వస్తుందంటే హిట్, ఫ్లోప్ కి సంబంధం లేకుండా ఆయన సినిమాల కోసం ఎదురుచూసే కల్ట్ ఫాన్స్ ఆయనకి ఉన్నారు. ప్రస్తుతం మణి రత్నం తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని ‘పొన్నియన్ సెల్వన్’ అనే సినిమాని రూపొందిస్తున్నాడు. కల్కి రచించిన ‘పొన్నియన్ సెల్వన్’ నవల ఆధారంగా ఈ సినిమా రూపొందిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటున్నా కానీ ఇప్పటివరకు అధికారిక అప్ డేట్ ఏమీ రాలేదు. ఈ రోజు ఈ సినిమా విడుదల గురించి ఒక ప్రకటన విడుదల చేసింది సినిమా టీం.

ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారం ఈ సినిమాని కూడా భాగాలుగా విడుదల చేయనున్నారు. ఈ సినిమా మొదటి పార్ట్ 2022 లో విడుదల అవనున్నట్టు ప్రకటించారు. ఈ సినిమాలో విక్రమ్, ఐశ్వర్య రాయ్, కార్తీ, జయం రవి, త్రిష, విక్రమ్ ప్రభు, జయరాం , ప్రభు, ఐశ్వర్య లక్ష్మి, శోభిత ధూళిపాళ, ప్రకాష్ రాజ్ లాంటి అగ్ర తారలు నటిస్తున్నారు. ఏ.ఆర్. రెహమాన్ సంగీతం, రవి వర్మన్ సినిమాటోగ్రఫీ, తోట తరణి ఆర్ట్ వర్క్, ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ లాంటి టాలెంటెడ్ టెక్నీషియన్స్ ఈ సినిమాకి పని చేయనున్నారు. కేవలం తమిళ్ మాత్రమే కాకుండా ఈ సినిమా కోసం ఎంతో మంది సినీ అభిమానులు ఎదురుచూస్తున్నారు. సుభాస్కరన్ సమర్పణలో లైకా ప్రొడక్షన్స్ మరియు మద్రాస్ టాకీస్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular