fbpx
HomeNationalనడి రోడ్డుపై హత్య చేసి..ఫోటో తీసి..

నడి రోడ్డుపై హత్య చేసి..ఫోటో తీసి..

MAN-KILLING-ANOTHER-RECORDED-IN-CC-CAMERAS

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఒక దారుణం జరిగింది. ఒక వ్యక్తి మరో వ్యక్తిపై అతీ సమీపం నుంచి కాల్పులు జరిపి, సెల్‌ఫోన్‌లో మృతుడి ఫొటోలు తీసుకుని తరువాత పరారయ్యాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి.

అక్టోబరు 22న ఢిల్లీలో చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా బయటకొచ్చింది. ఈ హత్య పాతకక్షల నేపథ్యంలోనే జరిగినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిని అరెస్టు చేశామని, అతడు నేరం చేసినట్లు అంగీకరించినట్లు పేర్కొన్నారు.

ఈ కేసులో నిందితుడైన పవన్‌ గహ్లోత్‌, సోదరుడు ప్రవీణ్‌ గహ్లోత్‌ 2019లో వికాస్‌ దలాల్‌ చేతిలో హతమయ్యాడు. ఆ తర్వాత కొన్నాళ్లకు పోలీసుల చేతికి చిక్కిన దలాల్‌ ఎదురుకాల్పుల్లో మృత్యువాత పడ్డాడు. అయితే సోదరుడి మరణంతో తీవ్రంగా కలత చెందిన పవన్‌, దలాల్‌ మృతి చెందడంతో అతడి అనుచరులనైనా మట్టుబెట్టాలని నిర్ణయించుకున్నాడు.

వారంతా కలిసే కుట్ర పన్ని తన సోదరుడు ప్రవీణ్‌ను హతమార్చారనే కోపంతో దలాల్‌ దగ్గర పనిచేసే ప్రదీప్‌ సోలంకి, అతడితో సంబంధాలు కలిగి ఉన్న వికాస్‌ మెహతా కదలికలపై దృష్టిసారించాడు. ఈ క్రమంలో వారం రోజుల క్రితం, మోహన్‌గార్డెన్‌ ఏరియాలో మాటువేసి వికాస్‌ మెహతాను పట్టుకున్నాడు. అతడిని వెంబడించి అతి సమీపం నుంచి కాల్పులు జరపగా మృతి చెందాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular