fbpx
HomeNationalమరో మిత్రపక్షం ఎన్డీయే కూటమి నుండి బయటకు

మరో మిత్రపక్షం ఎన్డీయే కూటమి నుండి బయటకు

LOKTANTRIK-TO-QUIT-NDA-ALLIANCE

న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన వ్యవసాయానికి సంబందించిన చట్టాలు దేశ వ్యాప్తంగా రైతుల్లో ఆగ్రహావేశాలకు గురిచేస్తున్నాయి. గత పార్లమెంట్‌ సమావేశాల్లో ఆమోదం పొందిన మూడు బిల్లులకు వ్యతిరేకంగా రైతులు, రైతు సంఘాల నేతలు నిరసన వ్యక్తం చేస్తున్నారు.

ఈ సందర్భంలో గడిచిన ఐదు రోజులుగా దేశ రాజధానిలో రైతులు ఆందోళనలు చేపడుతున్నారు. తమకు వ్యతిరేకంగా, కార్పొరేట్‌ వర్గాలకు అనుకూలంగా రూపొందించిన బిల్లులను వెంటనే వెనక్కి తీసుకోవాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. ముఖ్యంగా పంజాబ్‌, హర్యానా, రాజస్తాన్‌, ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్రాల్లో రైతులు పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నారు.

రైతుల చేస్తున్న దీక్షకు దేశ వ్యాప్తంగా వివిధ వర్గాల నుంచి భారీ మద్దతు లభిస్తోంది. ఇంకో వైపు నూతన వ్యవసాయ బిల్లులు ఎన్డీయే కూటమిలో చిచ్చుపెడుతున్నాయి. ఇప్పటికే ఆయా బిల్లులను వ్యతిరేకిస్తూ బీజేపీ చిరకాల మిత్రపక్షం శిరోమణీ అకాలీదళ్‌ ఎన్డీయే కూటమి నుంచి వైదొలిగారు.

కాగా, తాజాగా పంజాబ్‌ రైతాంగానికి మద్దతుగా ఆ పార్టీ ఎంపీ హర్‌సిమ్రాత్‌ కౌర్‌ బాదల్‌ కేంద్రమంత్రి పదవికి సైతం రాజీనామా సమర్పించారు. బిల్లులపై పార్లమెంట్‌లో చర్చసాగుతున్న తరుణంలో ఆమె ఈ నిర్ణయం తీసుకుని రైతులు మద్దతుగా నిలుచున్నారు.

కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతులు వ్యతిరేక విధానాలను నిరశిస్తూ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తాజాగా మరోసారి రైతుల నిరసన దేశ రాజధానికి తగలడంతో మరో భాగస్వామ్యపక్షం బీజేపీకి హెచ్చరికలు జారీచేసింది.

ఈ సమస్యలను త్వరగా ప్రభుత్వం పరిష్కరించపోతే ఎన్డీయే కూటమి నుంచి వైదొలుగతామని రాజస్తాన్‌కు చెందిన బీజేపీ మిత్రపక్షం లోక్‌తాంత్రిక్‌ పార్టీ (ఆర్‌ఎల్‌పీ) అధ్యక్షుడు హనుమాన్‌ బేనివాల్‌ ప్రకటించారు. దేశ రాజధాని నడిబొడ్డున చలిలో వేలాది రైతులు దీక్షలు నిర్వహిస్తుంటే కేంద్రం పట్టించుకోకపోడం ఘోరమన్నారు. ఈ మేరకు కేం‍ద్రహోంమంత్రి అమిత్‌ షాకు సోమవారం బేనివాల్‌ లేఖ రాశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular