న్యూఢిల్లీ: దేశంలోని వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం ఒక శుభవార్త చెప్పింది. ఇప్పటికే చెల్లుబాటు అయిపోయిన మోటార్ వెహికల్ డాక్యుమెంట్ల గడువును మరోసారి పొడిగించింది. కేంద్ర రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ ఇవాళ ఈ విషయాన్ని తెలిపింది.
ఇదివరకు సెప్టెంబర్ 30 వరకు చెల్లుబాటు చివరగా ఉన్న డ్రైవింగ్ లైసెన్స్ (డిఎల్), రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్(ఆర్సీ) వంటి పలు వాహన సంబందిత డాక్యుమెంట్ల గడువును తాజాగా అక్టోబర్ 31వ తేదీ 2021 వరకు పొడిగించింది. దీనికి సంబందించి రోడ్డు & రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది.
“కోవిడ్-19 మహమ్మారి దృష్ట్యా ఫిట్ నెస్, పర్మిట్, అన్ని రకాల లైసెన్స్, మరియు రిజిస్ట్రేషన్ ఏదైనా ఇతర సంబంధిత డాక్యుమెంట్(ల) గడువును 30 సెప్టెంబర్ 2021 వరకు పొడగించినట్లు” ట్విటర్ ద్వారా కేంద్రం తెలిపింది. కనుక ఈ క్లిష్ట సమయంలో పనిచేస్తున్న పౌరులు, రవాణాదారులు అసౌకర్యానికి గురికాకుండా చూసేలా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు చర్యలు తీసుకోవాలని రోడ్డు & రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ లేఖ రాసింది.
భారత మోటారు వాహనాల చట్టం, 1988 మరియు సెంట్రల్ మోటార్ వెహికల్ రూల్స్, 1989కు సంబంధించిన మోటార్ వెహికల్ డాక్యుమెంట్ల పొడిగించింది. గత ఏడాది మార్చిలో వచ్చిన మహమ్మారి కారణంగా అప్పటి నుంచి వీటి గడువును 6 సార్లు పొడిగించింది.