fbpx
Tuesday, June 6, 2023

INDIA COVID-19 Statistics

44,991,880
Confirmed Cases
Updated on June 6, 2023 10:00 am
531,884
Deaths
Updated on June 6, 2023 10:00 am
3,001
ACTIVE CASES
Updated on June 6, 2023 10:00 am
44,456,995
Recovered
Updated on June 6, 2023 10:00 am
HomeMovie Newsమహారాష్ట్ర ప్రభుత్వం పై నిప్పులు చెరుగుతున్న కంగనా

మహారాష్ట్ర ప్రభుత్వం పై నిప్పులు చెరుగుతున్న కంగనా

KanganaRanult WarAgainest MaharashtraGoverment

ముంబై: గత కొద్ది రోజులుగా సుశాంత్ సింగ్ ఆత్మ హత్య అక్కడి నుండి దానిపై సిబిఐ ఇన్వెస్టిగేషన్, ఆ తర్వాత అది కాస్త డ్రగ్ ఇన్వెస్టిగేషన్ లాగ తయారైంది. వీటిపై కామెంట్స్ చేసిన కంగనా పై ఇపుడు ఫోకస్ షిఫ్ట్ అయింది. ఈ క్రమం లో కంగనా ఆస్తుల పైన దాడులు చెయ్యడం వల్ల కంగనా మహారాష్ట్ర ప్రభుత్వం పై విరుచుకుపడుతుంది. సుశాంత్ ను హత్య చేసిన వారితోపాటు మూవీ మాఫియా డ్రగ్ రాకెట్ వంటి వ్యవహారాలను బయటపెడతానంటూ తాను వ్యాఖ్యానించానని బాలీవుడ్ మూవీ మాఫియాతో మహారాష్ట్ర సీఎం ముద్దుల కొడుకు ఆదిత్య థాకరే కలిసి తిరుగుతుంటాడని షాకింగ్ ట్వీట్ చేసింది. అలా వ్యాఖ్యానించడమే తాను చేసిన పెద్ద నేరమని అందుకే తనపై మహారాష్ట్ర సీఎం కక్ష సాధిస్తున్నారని తనను సరిదిద్దాలని చూస్తున్నారని ట్వీట్ చేసింది. ఎవరిని ఎవరు సరిచేస్తారో చూద్దామంటూ కంగనా ట్వీట్ చేసింది.

వరుస దాడులతో, దారుణ వ్యాఖ్యలతో తనను భయభ్రాంతులకు గురి చేశారని ఆవేదన వ్యక్తం చేసింది. తన కార్యాలయాన్ని కూల్చేసిన తర్వాత తన ఇంటిని కూడా కూల్చడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడింది. ఈ పరిణామాలన్నింటిని చూస్తే ముంబైని పీఓకే అంటూ తాను చేసిన కామెంట్ కరెక్టే అనిపిస్తోందని చెప్పింది.ఈసారికి తాను ముంబై నుంచి సురక్షితంగా బయటపడ్డానని చెప్పింది. ఒకానొక సమయంలో ముంబైలో తాను ఒక తల్లి స్పర్శను అనుభవించానని కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ముంబైలో తాను బతికుండటమే లక్కీ అనిపిస్తోందని తెలిపింది. ఎప్పుడైతే శివసేన పార్టీ సోనియాసేనగా మారిపోయిందో, ముంబై అధికార యంత్రాంగమంతా టెర్రర్ గ్రూపులా తయారైందని తీవ్ర వ్యాఖ్యలు చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular