fbpx
Saturday, July 27, 2024
HomeNationalనష్టాల్లో ఉన్న ప్రభుత్వ సంస్థల ఉపసంహరణ

నష్టాల్లో ఉన్న ప్రభుత్వ సంస్థల ఉపసంహరణ

INVESTMENT-WITHDRAWL-FROM-GOVERNMENT-COMPANIES-IN-LOSSES

న్యూఢిల్లీ: ఇప్పటికే భారీ నష్టాలు చవిచూస్తున్న ప్రభుత్వ రంగ సంస్థల్లో కేంద్ర ప్రభుత్వం ఇకపై పెట్టుబడులను కొనసాగించ కూడదన్న విషయంపై ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంటులో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ రంగం లో ఉన్న సంస్థల నుంచి వ్యూహాత్మకంగా పెట్టుబడుల ఉపసంహరణ ఉంటుందని వెల్లడించారు.

భారత ప్రభుత్వ రంగ సంస్థలైన బీపీసీఎస్, ఎయిరిండియా, షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఐడీబీఐ బ్యాంక్, బీఈఎంఎల్, పవన్ హన్స్, నీలాచల్ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ సంస్థల నుంచి వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణ 2021-22 నాటికి పూర్తవుతుందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.

వీటిలో రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఒక జనరల్ ఇన్సూరెన్స్ సంస్థను కూడా ప్రైవేటీకరిస్తున్నట్టు తెలిపారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఎల్ఐసీ ఐపీవోకు వెళుతుందని మోదీ పేర్కొన్నారు. అటు, రైతు ప్రయోజనం కోసం ప్రాథమిక కస్టమ్స్ సుంకంలో మార్పులు చేసినట్టు వివరించారు. పత్తిపై కస్టమ్స్ సుంకాన్ని సున్నా నుంచి 10 శాతానికి పెంచామని, ముడిపట్టు, పట్టునూలుపై సుంకాన్ని 10 శాతం నుంచి 15 శాతానికి పెంచినట్టు పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular