fbpx
HomeInternationalబంగ్లాదేశ్‌ను చిత్తు చేసి సెమీస్‌ ఆశలు సజీవంగా ఉంచుకున్న భారత్!

బంగ్లాదేశ్‌ను చిత్తు చేసి సెమీస్‌ ఆశలు సజీవంగా ఉంచుకున్న భారత్!

INDIA-WOMEN-BEAT-BANGLADESH-KEEP-SEMIS-HOPES-ALIVE

హామిల్టన్: మహిళల వన్డే ప్రపంచకప్‌లో భాగంగా బం‍గ్లాదేశ్‌తో జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో భారత మహిళల జట్టు 110 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో ప్రపంచకప్‌లో సెమీస్‌ ఆశలు సజీవంగా నిలుపుకుంది భారత జట్టు.

230 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్‌ మహిళల జట్టు భారత బౌలర్ల ధాటికి 119 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో స్నేహ్‌ రానా నాలుగు వికెట్లు పడగొట్టి బం‍గ్లాదేశ్‌ పతనాన్ని శాసించింది.
గోస్వామి, పూజా వస్త్రాకర్‌ చెరో రెండు వి​కెట్లు సాధించి భారత్ విజయంలో తమ వంతు పాత్ర పోషించారు.

బం‍గ్లాదేశ్‌ బ్యాటర్లలో సల్మా ఖతూన్‌(32) పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచింది. అంతకుముందు భారత్‌ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. ఓపెనర్లు స్మృతి మంధాన(30), షఫాలీ వర్మ(42) రాణించగా, యస్తికా భాటియా అర్ధ శతకంతో జట్టు మెరుగైన స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular