fbpx
HomeBusinessభారత్ లో ఐకియా నష్టం రూ. 720 కోట్లు

భారత్ లో ఐకియా నష్టం రూ. 720 కోట్లు

IKEA-720CRORES-LOSS-IN-INDIA

న్యూఢిల్లీ: ఇండియా లోని ఫర్నీచర్‌ రిటైల్‌ దిగ్గజం అయిన ఐకియా కు గత ఆర్థిక సంవత్సరం(2019-20)లో రూ. 720 కోట్ల నష్టాలు కలిగాయి. అంతక్రితం ఏడాది(2018-19) నమోదైన రూ. 685 కోట్లతో పోలిస్తే నష్టాలు కాస్త పెరిగాయి. అదే కాలంలో అమ్మకాలు 65 శాతం ఎగసి రూ. 566 కోట్లను చేరుకున్నాయి.

దీంతో మొత్తం ఆదాయం 63 శాతం పెరిగి రూ. 666 కోట్లకు చేరింది. 2019లో అమ్మకాలు రూ. 344 కోట్లుగా నమోదుకాగా.. రూ. 408 కోట్ల ఆదాయం మాత్రమే లభించింది. గతేడాది ఇతర ఆదాయం రూ. 64 కోట్ల నుంచి రూ. 100 కోట్లకు పెరిగింది. మార్కెట్‌ ఇంటెలిజెన్స్‌ సంస్థ టోఫ్లర్‌ అందించిన వివరాలివి.

ఐకియా ఇండియా సీఎఫ్‌వో ప్రీత్‌ ధుపర్ భారత్ మార్కెట్ తమకు అత్యంత ప్రాధాన్యత కలిగిన మార్కెట్‌ అని ఫలితాలపై స్పందిస్తూ ‌ పేర్కొన్నారు. ఇక్కడ దీర్ఘకాలంపాటు కొనసాగే ప్రణాళికల్లో ఉన్నట్లు తెలియజేశారు. ఇక్కడి కార్యకలాపాలు తొలిదశలో ఉన్నట్లు తెలియజేశారు. అందుబాటు ధరలు, నాణ్యతతో కూడిన ఉత్పత్తుల ద్వారా దేశీ మార్కెట్లో మరింత విస్తరించాలని చూస్తున్నట్లు చెప్పారు.

స్వీడిష్ ఫర్నీచర్‌ దిగ్గజం అయిన ఐకియా 2018 ఆగస్ట్‌లో హైదరాబాద్‌లో తొలి రిటైల్ స్టోర్‌ను ఏర్పాటు చేసిన విషయం విదితమే. అంతేకాకుండా ముంబై, హైదరాబాద్‌, పుణేలలో ఆన్‌లైన్‌ స్టోర్లను నిర్వహిస్తోంది. ఇటీవలే ముంబైలోనూ రెండో రిటైల్‌ స్టోర్‌ను కూడా ప్రారంభించింది. ఈ బాటలో డిమాండుకు అనుగుణంగా మరో రెండు సిటీ స్టోర్లను ప్రారంభించే యోచనలో ఉన్నట్లు ప్రీత్‌ తెలియజేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular