fbpx
HomeAndhra Pradeshకొత్త ఐసిఎంఆర్ డేటా, తెలంగాణ యొక్క కాంటాక్ట్ ట్రేసింగ్ పై సందేహాలు

కొత్త ఐసిఎంఆర్ డేటా, తెలంగాణ యొక్క కాంటాక్ట్ ట్రేసింగ్ పై సందేహాలు

హైదరాబాద్: ఐసిఎంఆర్ వెలువరించిన కొత్త డేటా ప్రకారం కోవిడ్-19 కాంటాక్ట్ ట్రేసింగ్ విషయంలో తెలంగాణను నిష్ప్రయోజన రాష్ట్రాల జాబితా లో చేర్చింది. కోవిడ్-19 కేసులను గుర్తించడానికి తెలంగాణలో తక్కువ సంఖ్యలో నమూనాలను పరీక్షించడంపై వివాదం తరువాత, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) యొక్క ఇండియన్ జర్నల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (IJMR) లో ఇటీవల ప్రచురించిన పేపర్‌లో సమర్పించిన డేటా ప్రకారం మహమ్మారి యొక్క కీలకమైన ప్రారంభ కాలంలో, జనవరి 22 నుండి ఏప్రిల్ వరకు తెలంగాణ ప్రభుత్వం చేసిన కాంటాక్ట్ ట్రేసింగ్ ప్రయత్నాలపై సందేహాలు వ్యక్తం చేస్తోంది.

డేటా ప్రకారం, కోవిడ్-19 ధృవీకరించబడిన కేసులో తెలంగాణ, 14 కాంటాక్ట్స్ ను మాత్రమే పరీక్షించింది, తద్వారా దీనిని 50 శాతం కంటే తక్కువ కాంటాక్ట్స్ పరీక్షించిన రాష్ట్రాల కింద వర్గీకరిస్తుంది, అంటే రాష్ట్రంలో అధికారులు కోవిడ్-19 రోగి తో పరిచయం ఏర్పడిన సగం మందిని కూడా గుర్తించలేదు.

అధిక సంఖ్యలో COVID-19 కేసులు మరియు మరణాలను నివేదించిన మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్ మరియు పంజాబ్ రాష్ట్రాలతో తెలంగాణ ఈ పేలవమైన పనితీరు వర్గం లో చేరింది. ఇతర దక్షిణ భారత రాష్ట్రాలు ఏవీ ఈ కోవలోకి రావు. ధృవీకరించబడిన కేసులో 54 కాంటాక్ట్స్ ను పరీక్షించిన ఆంధ్రప్రదేశ్ 50-75 శాతం పరిచయాలను పరీక్షించిన రాష్ట్రంగా వర్గీకరించబడింది. తమిళనాడు (44), కేరళ (40) మరియు కర్ణాటక (93) 75 శాతం కాంటాక్ట్స్ ను పరీక్షించిన రాష్ట్రాలుగా వర్గీకరించబడ్డాయి. ఈ డేటాను ప్రచురించిన అధ్యయనం పేరు ‘లాబరేటరీ సర్వేయిల్లాన్స్ ఫర్ SARS -CoV-2 ఇన్ ఇండియా : పెర్ఫార్మన్స్ అఫ్ టెస్టింగ్ & డిస్క్రిప్టివ్ ఎపిడెమియోలజీ అఫ్ డెటెక్ట్డ్ COVID-19 , జనవరి 22 – ఏప్రిల్ 30, 2020’.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular