fbpx
HomeNationalప్రభుత్వ రంగ బ్యాంకు ఉద్యోగులకు తీపికబురు

ప్రభుత్వ రంగ బ్యాంకు ఉద్యోగులకు తీపికబురు

GOVERNMENT-BANK-EMPLOYEES-PERFORMANCE-LINKED-INCENTIVES

ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎస్‌బీ) 2020 నవంబర్‌లో ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్(ఐబీఎ)తో కుదుర్చుకున్న వేతన ఒప్పందం ప్రకారం పీఎల్‌ఐలను (పర్ఫార్మెన్స్ లింక్డ్ ఇన్సెంటివ్స్) పంపిణీ చేస్తున్నాయి. ఈ ఒప్పందం ప్రకారమే పనితీరు మెరుగ్గా ఉంటే ఉద్యోగులకు అదనపు ప్రయోజనం చేకూరుతుంది.

కాగా 2021 సంవత్సరంలో కెనరా బ్యాంక్ యొక్క నికర లాభం రూ.2,557 కోట్లు. అందువల్ల కెనరా బ్యాంక్ ఈ వారం తన బ్యాంక్ సిబ్బందికి 15 రోజుల విలువైన జీతాన్ని పీఎల్‌ఐ(పనితీరు-ఆధారంగా ప్రోత్సాహకాల)గా చెల్లింపు చేసింది. బ్యాంకులు మే 18న నాలుగవ త్రైమాసికంలో 1,010.87 కోట్ల రూపాయల స్వతంత్ర లాభాన్ని సంపాదించాయి.

2020-21 ఆర్థిక సంవత్సర నాలుగో త్రైమాసికంలో 165 కోట్ల రూపాయల నికర లాభాన్ని ఆర్జించిన తర్వాత బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర పీఎల్‌ఐ కింద నగదును ఉద్యోగులకు పంపిణీ చేసింది. అన్ని ర్యాంకులు, హోదాల్లోని ఉద్యోగులకు ఈ పీఎల్‌ఐలు లభిస్తాయి. దేశంలోని అతిపెద్ద బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా తన ఉద్యోగులకు పనితీరు ఆధారంగా ప్రోత్సాహకాలను ఇస్తున్నట్లు ప్రకటించింది. ఎస్‌బీఐలో 2.5 లక్షల మందికి ఈ లాభం పొందే అవకాశం ఉంది.

ప్రభుత్వ రంగ బ్యాంకుల లాభం 2 శాతం నుంచి 5 శాతం మధ్య వస్తే వారికి 5 రోజుల వేతనం, 10 నుంచి 15 శాతం వస్తే 10 రోజుల వేతనం, 15 శాతం కంటే ఎక్కువ లాభం వస్తే ప్రోత్సాహకంగా ఉద్యోగులకు 15 రోజుల వేతనం అదనంగా లభిస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular