fbpx
HomeNationalఅన్ని రాష్ట్రాలు వ్యాక్సిన్ ఉచితంగా ఇవ్వడానికి ముందుకు

అన్ని రాష్ట్రాలు వ్యాక్సిన్ ఉచితంగా ఇవ్వడానికి ముందుకు

FREE-VACCINATION-BY-STATES-FOR-18-45-YEARS-PERSONS

హైదరాబాద్‌: దేశంలో 45 ఏళ్ల పైబడిన వారికి కేంద్ర ప్రభుత్వం ఉచితంగా టీకా అందిస్తోంది, అయితే త్వరలో 18-45 ఏళ్ల వారికి మే 1వ తేదీ నుంచి వ్యాక్సిన్‌ అందించాలని నిర్ణయించింది. కాగా 18-45 వయసు వాళ్ళకు మాత్రం ఉచితంగా ఇవ్వడం లేదు. కాబట్టి ఆ వయసు మధ్య వారు వ్యాక్సిన్ ను బయట కొనుక్కుని వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఈ సందర్భంలో కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్ ఉచితంగా ఇవ్వకున్నా రాష్ట్రాలు మాత్రం తాము ఉచితంగా టీకా అందిస్తామని దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాలు ముందుకు వచ్చాయి. 18-45 ఏళ్ల వారికి ఉచితంగా టీకా అందిస్తామని ఏకంగా దేశంలోని 23 రాష్ట్రాలు ప్రకటించాయి. కాగా తెలంగాణతో పాటు మరో రెండు, మూడు రాష్ట్రాలు తమ రాష్ట్రంలో ఎటువంటి వయసుతో నిమిత్తం లేకుండా ఉచితంగా టీకా అందిస్తామని ప్రకటించాయి. ఇప్పటివరకు దేశంలో 19.19 కోట్ల మంది 45 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సిన్‌ను అందించారు.

కేంద్ర ప్రభుత్వం 18 నుంచి 45 ఏళ్ల వయసు ఉన్న వారికి వ్యాక్సిన్‌ వేయడానికి అనుమతి ఇచ్చింది. కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో వ్యాక్సిన్ వేయడమే దానికి విరుగుడుగా భావిస్తున్నారు. ఈ క్రమంలో అందరికీ వ్యాక్సిన్‌ వేయించాలని రాష్ట్రాలు సంకల్పించాయి. అదే విధంగా తమ రాష్ట్రంలోని ప్రజలకు ఈ టీకాను ఉచితంగా వేసేందుకు ముందుకు వచ్చాయి.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు 23 రాష్ట్రాలు ఉచితంగా టీకా అందించడానికి ముందుకు వచ్చాయి. ఇక తెలంగాణ ప్రభుత్వం వయసు నిమిత్తం లేకుండా అన్ని వయసుల వారికి ఉచితంగా టీకా అందిస్తామని ప్రకటించింది. ఉచితంగా టీకా అందిస్తామని ప్రకటించిన రాష్ట్రాల జాబితాలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, తమిళనాడు, మహారాష్ట్ర, కేరళ, బిహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, హరియాణా, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్, సిక్కిం, పశ్చిమ బెంగాల్, అసోం, గోవా, ఒడిశా, ఢిల్లీ, జమ్మూ కశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్, గుజరాత్, రాజస్తాన్‌ ఉన్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular