fbpx
Wednesday, December 6, 2023

INDIA COVID-19 Statistics

44,998,565
Confirmed Cases
Updated on September 26, 2023 9:12 pm
531,930
Deaths
Updated on September 26, 2023 9:12 pm
557
ACTIVE CASES
Updated on September 26, 2023 9:12 pm
44,466,078
Recovered
Updated on September 26, 2023 9:12 pm
HomeAndhra Pradeshరైతులకు విద్యుత్‌ పూర్తిగా ఉచితమే: సీఎం జగన్‌

రైతులకు విద్యుత్‌ పూర్తిగా ఉచితమే: సీఎం జగన్‌

FREE-CURRENT-FOR-FARMERS-IN-AP

అమరావతి: రైతులకు ప్రభుత్వం అందించే విద్యుత్తు ఎప్పటికీ పూర్తి ఉచితమేనని, ఇప్పటికే ఉన్న ఒక్క కనెక్షన్‌ కూడా తొలగించేది లేదని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సుస్పష్టం చేశారు. ప్రభుత్వం చేపడుతున్న సంస్కరణల వల్ల రైతులపై ఒక్కపైసా భారం కూడా పడనివ్వమని ఆయన హామీ ఇచ్చారు.

ఇప్పటికే అమల్లో ఉన్న పథకాన్ని మరింత మెరుగుపరుస్తున్నామని, వచ్చే 30–35 ఏళ్లపాటు రైతులకు ఉచిత విద్యుత్‌ పథకానికి ఎలాంటి ఢోకా లేకుండా చేస్తున్నట్లు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్‌ కేబినేట్‌ గురువారం నాడు సమావేశమైంది. సీఎం జగన్‌ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో ఉచిత విద్యుత్‌ పథకం- నగదు బదిలీకి రాష్ట్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది.

ఈ కేబినెట్ భేటీ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ, అన్ని వ్యవసాయ కనెక్షన్లను క్రమబద్ధీకరిస్తున్నట్లు తెలిపారు. ‘కనెక్షన్‌ ఉన్న రైతు పేరు మీద బ్యాంకు ఖాతా ఉంటుంది. కరెంటు బిల్లు డబ్బు అందులో నేరుగా జమ కానుంది. అదే డబ్బును రైతులు విద్యుత్తు కంపెనీలకు చెల్లించబోతున్నారు. దీని వల్ల రైతుపై ఎలాంటి అదనపు భారం ఉండదు’ అని ఆయన స్పష్టం చేశారు.

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్తు బకాయిలు తీర్చామన్నారు. రూ. 1700 కోట్లతో ఫీడర్లను అప్‌గ్రేడ్ చేశాం. నాణ్యమైన కరెంటును ఇస్తున్నాం. పగటిపూట 9 గంటల కరెంటు, ఇప్పటికే 89శాతం ఫీడర్లలో అమలు అవుతోంది. రబీ సీజన్‌ నుంచి పూర్తి స్థాయిలో అమల్లోకి వస్తుంది. 10వేల మెగావాట్ల సోలార్‌తో పథకాన్ని మరింత గొప్పగా దీర్చిదిద్దుతాం. ఉచిత విద్యుత్‌ పథకానికి ఢోకా లేకుండా ప్రణాళికలు రచిస్తున్నాం. ఉచిత విద్యుత్‌పై పేటెంట్‌ ఒక్క వైఎస్సార్‌కే ఉంది. అందుకే పథకానికి ఆయన పేరు పెడుతున్నాం’’ అని సీఎం జగన్‌ తెలిపారు.

ఉచిత విద్యుత్‌ పథకం పైలట్‌ ప్రాజెక్టుగా శ్రీకాకుళం జిల్లాలో అమలు చేయబోతున్నట్లు వెల్లడించారు. అదే విధంగా ఏప్రిల్‌ 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసేందుకు రంగం సిద్ధమైనట్లు పేర్కొన్నారు. ఇక కేంద్ర ప్రభుత్వం తెస్తున్న సంస్కరణలకు అనుగుణంగానే వ్యవసాయ విద్యుత్తు వినియోగదారులకు నగదు బదిలీ పథకాన్ని చేపట్టాల్సి వచ్చిందని ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజేయ కల్లం స్పష్టం చేసిన విషయం తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular