fbpx
Thursday, April 25, 2024
HomeBig Storyఉప ఎన్నికలు వాయిదా: ఎన్నికల సంఘం

ఉప ఎన్నికలు వాయిదా: ఎన్నికల సంఘం

elections-postponed-election-commission-india

న్యూఢిల్లీ: దేశంలోని చాలా రాష్ట్రాలలో కరోనా వైరస్‌ విజృంభన కొనసాగుతూనే ఉంది. కరోనా కేసుల సంఖ్యల రోజురోజుకు పెరుగుతోంది. ప్రజలు ఎక్కువగా బయటకు తిరగకూడదని ప్రభుత్వాలు చెప్తున్నా ప్రజలు పట్టించుకోవట్లేదు. లాక్ డౌన్ ను కూడా ప్రజలు సీరీయస్ గా తీసుకోవడం లేదు. తద్వారా కరోన నియంత్రణ కష్టం అవుతోంది.

దీంతో ఎక్కడికక్కడ పాక్షిక లాక్ డౌన్లు విధిస్తున్నాయి రాష్ట్ర ప్రభుత్వాలు. ఇదే తరుణలో కొన్ని రాష్ట్రాలలొ ఇంతకు ముందు ప్రకటించిన ప్రకారం ఎన్నికలకు తేదీలు దగ్గర కు వస్తున్నాయి. కానీ కరోనా విజృంభిస్తున్న ఈ సమయంలో ఎన్నికల నిర్వహణ సాధ్యం కాని పరిస్థితి.

దీంతో దేశవ్యాప్తంగా పలు స్థానాల్లో జరగాల్సిన లోక్‌సభ, అసెంబ్లీ ఉప ఎన్నికలను కేంద్ర ఎన్నికల సంఘం వాయిదా వేసింది. కరోనా వైరస్‌, వరదల నేపథ్యంలో అసెంబ్లీ స్థానాల్లో జరగాల్సిన ఉప​ ఎన్నికలు వాయిదా వేసినట్లు గురువారం ఎన్నికల సంఘం ప్రకటించింది.

దీంతో ఆరు రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న ఎనిమిది అసెంబ్లీ స్థానాల్లో ఉపఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా విడుదల చేసిన షెడ్యూల్‌ ప్రకారం ఈ ఉప ఎన్నికలు సెప్టెంబర్‌ 7 వరకు నిర్వహించాల్సింది. తాజాగా ఎన్నికల సంఘం ప్రకటనతో అస్సాం, కేరళ, మధ్యప్రదేశ్, నాగాలాండ్, ఉత్తర ప్రదేశ్, జార్ఖండ్ రాష్ట్రాల్లో జరగాల్సిన ఉప ఎన్నికలు వాయిదా పడ్డాయి.

తిరిగి ఈ ఎన్నకలు నిర్వహిస్తారు అన్నది ప్రస్తుతానికి తెలియజేయలేదు. ఈ షెడ్యూల్ త్వరలోనే తెలియజేస్తామని ఎన్నికల సంఘం పేర్కొంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular