fbpx
HomeSportsమహేంద్ర సింగ్ ధోనీ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్

మహేంద్ర సింగ్ ధోనీ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్

DHONI-PLAYS-MORE-IPL-SEASONS-SAYS-CEO-KASI

ముంబై: టీమిండియా మాజీ‌ కెప్టెన్, మరియు సీఎస్కే‌ కెప్టెన్ మహేంద్రసింగ్‌ ధోనికి ఇదే ఆఖరి ఐపీఎల్‌ అన్న పుకార్లు వైరల్ అవుతున్న నేపథ్యంలో చెన్నై సూప‌ర్ కింగ్స్ ఫ్రాంఛైజీ యాజమాన్యం స్పందించింది. మహేంద్ర సింగ్ ధోనిలో ఇంఖా అత్యుత్తమ క్రికెట్‌ ఆడగలిగే సత్తా ఉందని, అతను ఇంఖా చాలా ఐపీఎల్‌లు ఆడగలడని, ఐపీఎల్‌ 2021 కచ్చితంగా అతనికి ఆఖరి ఐపీఎల్‌ కాదని ఆ జట్టు సీఈవో కాశీ విశ్వ‌నాథ‌న్ ప్రకటించాడు.

కాగా ఇది మాత్రం పూర్తిగా తన వ్య‌క్తిగ‌త అభిప్రాయమని ఆయన చెప్పారు. ప్రస్తుతానికి తాము ధోని ప్రత్యామ్నాయం గురించి ఆలోచించట్లేదని, మున్ముందు కూడా ఆ ఆలోచన చేసే అవకాశం రాకపోవచ్చని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశాడు. కాగా, ధోని ఇటీవలే అంతార్జతీయ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లకు గుడ్‌బై చెప్పిన సంగతి తెలిసిందే.

దీనితో పాటు సీఎస్కే లోని మ‌రో ఇద్ద‌రు ప్రముఖ‌ ఆట‌గాళ్ల గురించి కూడా విశ్వ‌నాథ‌న్ స్పందించాడు. రైనా, జడేజాల రూపంలో తమ జట్టులో ఇద్దరు భారీ హిట్టర్లు ఉన్నారని, వారు రానున్న సీజన్‌లో కుర్రాలతో పోటీపడి మరీ పరుగులు సాధిస్తారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశాడు.

రవీంద్ర జ‌డేజా ఫిట్‌నెస్‌ సమస్యలతో బాధపడుతున్నా దాని గురించి పెద్దగా చింతించాల్సిన అవసరం లేదని, అతను ఫిట్‌గా ఉన్నాడ‌ని ఎన్‌సీఏనే స్వయంగా చెప్పిందని పేర్కొన్నాడు. ప్రస్తుతం జడేజా జట్టుతో చేరాడని, తమ తొలి మ్యాచ్‌లోపు అత‌ను పూర్తి ఫిట్‌నెస్ సాధిస్తాడ‌ని ఆశాభావం వ్యక్తం చేశాడు.

మరోవైపు రైనా గ‌త ప‌ది రోజులుగా జట్టుతో పాటే ప్రాక్టీస్ చేస్తున్నాడ‌ని, ఈ సీజ‌న్‌లో త‌న‌ను తాను ప్రూవ్ చేసుకోవ‌డానికి ఆరాట‌ప‌డుతున్నాడని తెలిపాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular