fbpx
HomeNationalకరోనా బారిన పడ్డ మాజీ ప్రధాని దేవెగౌడ, భార్య!

కరోనా బారిన పడ్డ మాజీ ప్రధాని దేవెగౌడ, భార్య!

DEVEGOWDA-TWEETS-COVID-POSITIVE-HE-AND-HIS-WIFE

బెంగళూరు : మాజీ ప్రధానమంత్రి, సీనియర్ నాయకుడు హెచ్‌డీ దేవెగౌడ ‌(87) మరియు ఆయన భార్య ఇద్దరూ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని స్యయంగా దేవెగౌడ తన‌ ట్విటర్‌ అకౌంట్ ద్వారా వెల్లడించారు. నాకు, నా భార్య చెన్నమ్మకు కోవిడ్‌-19 పాజిటివ్‌ నిర్ధారణ అయిందని ఆయన తెలిపారు.

ప్రస్తుతం తాము ఇతర కుటుంబ సభ్యులతో కలిసి హోం ఐసోలేషన్‌లో ఉన్నామని, తమతో గత కొన్ని రోజులుగా సన్నిహితంగా మెలిగినవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అంతేకాదు పార్టీ కార్యకర్తలు, శ్రేయోభిలాషులు భయపడవద్దని జాగ్రత్తగా కూడా ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

మీరు త్వరగా కోలుకోవాలంటూ కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్‌ యడ్యూరప్ప ట్విట్‌ చేశారు. కరోనా నుంచి త్వరగా కోలుకుని, యథావిధిగా వారి పనికి తిరిగి వస్తారని తాను ఆశిస్తున్నానని ఆయన పేర్కొన్నారు. కర్ణాటక ఆరోగ్య మంత్రి కె సుధాకర్ స్పందిస్తూ రాజ్యసభ ఎంపీ మాజీ ప్రధాని దేవెగౌడ్‌,ఆయన భార్యకు కరోనా సోకిందని తెలిసింది.

ఈ నేపథ్యంలో వారికి చికిత్స చేస్తున్న వైద్యులతో తాను సంప్రదింపులు జరుపుతున్నానని ట్వీట్‌ చేశారు. వారు త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నానన్నారు. కాగా దేశంలో కరోనా వైరస్‌ రెండవ దశలో మళ్లీ విజృంభిస్తోంది. కర్ణాటక సహా, మహారాష్ట్ర, ఢిల్లీలో కరోనా కేసులు పెరుగుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular