fbpx
HomeBusinessకరోనా ఎఫెక్ట్ తో స్టాక్ మార్కెట్ల పతనం!

కరోనా ఎఫెక్ట్ తో స్టాక్ మార్కెట్ల పతనం!

CORONA-EFFECT-SENSEX-LOSSES-ON-MONDAY

ముంబై: సోమవారం కొత్త వారం మొదలు దేశీయ స్టాక్ ‌మార్కెట్లు అధిక నష్టాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయంగా నెలకొన్న ప్రతికూల సంతకేతాలతో పాటు, స్వదేశంలో కరోనా మహమ్మారి మరో సారి విజృంభించడం, మరియు అక్కడక్కడా లాక్‌డౌన్‌ కారణాల వల్ల సోమవారం సూచీలు ప్రధాన మద్దతు స్థాయిలను కోల్పోయాయి.

ఈ రోజు సెన్సెక్స్‌ 401 పాయింట్లు నష్టపోయి 49638 వద్ద, నిఫ్టీ 96 పాయింట్లు కోల్పోయి 14770 వద్ద కొనసాగుతున్నాయి. దాదాపు అన్ని రంగాల షేర్లు నష్ట పోయాయి. బజాజ్‌ ఫిన్‌ సర్వ్‌, ఐషర్‌ మోటార్స్‌, ఇండస్‌ ఇండ్‌, బజాజ్‌ఆటో, యాక్సిస్‌ బ్యాంకు భారీగా నష్టాలపలయ్యాయి. క్యూ4 లో 14 శాతం నికర లాభాలు పుంజుకున్న నేపథ్యంలో సెయిల్‌ భారీగా లాభపడింది.

కాగా కరోనా సెకండ్‌వేవ్‌ ఉన్నా భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి క్రమం మాత్రం బలంగానే ఉందని గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ నోమురా తెలిపింది. అయితే లాక్‌డౌన్‌, పెరిగిన ఆంక్షల నేపథ్యంలో క్యూ 2 జీడీపీని ప్రభావితం చేయవచ్చని హెచ్చరించింది. ఇంకో వైపు దేశంలో కరోనా కేసులు రికార్డ్‌ స్థాయిలో నమోదవుతూ మరింత ఆందోళన రేపుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular