fbpx
HomeNationalవిడుదలైన సివిల్ సర్వీసెస్ 2020 ఫలితాలు!

విడుదలైన సివిల్ సర్వీసెస్ 2020 ఫలితాలు!

CIVILS-2020-RESULTS-RELEASED-BY-UPSC

న్యూఢిల్లీ: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) సివిల్స్‌-2020 తుది ఫలితాలను ఇవాళ విడుదల చేసింది. దీనిలో మొత్తం 761 మంది అభ్యర్థుల ఎంపిక జరిగింది. ఈ జాబితాలో 545 మంది పురుష అభ్యర్థులు ఉండగా 216 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు. రిజర్వేషన్ల వారిగా చూస్తే 263 మంది జనరల్‌, 229 ఓబీసీ, 122 ఎస్సీ, 61 ఎస్టీ, 86 మంది ఈడబ్య్లూఎస్‌ కేటగిరి అభ్యర్థులు ఎంపికయ్యారు.

విడుదలైన సివిల్స్‌-2020 తుది ఫలితాల్లో ఐఐటీ బాంబే నుంచి బీటెక్‌(సివిల్‌ ఇంజనీరింగ్‌) చేసిన శుభం కుమార్‌కు ఫస్ట్ ర్యాంకు రాగా, భోపాల్‌ నిట్‌ నుంచి బీటెక్‌ (ఎలక్రికల్‌ ఇంజనీరింగ్‌) చేసిన జాగృతి అవస్తికి రెండవ ర్యాంకు పొందింది. మహిళల విభాగంలో అవస్తి టాపర్‌గా నిలిచింది. కాగా ఈ ఏడాది జనవరిలో సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షలు నిర్వహించింది.

ఆ మెయిన్స్‌ పరీక్షలో అర్హత సాధించిన వారికి ఇంటర్వ్యూలు నిర్వహించిన తరువాత శుక్రవారం సాయంత్రం తుది ఫలితాలను యూపీఎస్సీ విడుదల చేసింది.

సివిల్స్‌ ఫలితాలలో మెరిసిన తెలుగు విద్యార్థులు:
► పి. శ్రీజ – 20వ ర్యాంకు
►మైత్రేయి నాయుడు – 27వ ర్యాంకు
►జగత్‌ సాయి – 32వ ర్యాంకు
►దేవగుడి మౌనిక(కడప) – 75వ ర్యాంకు
►రవి కుమార్‌ – 84వ ర్యాంకు
►యశ్వంత్‌ కుమార్‌ రెడ్డి – 93వ ర్యాంకు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular