fbpx
HomeLife Styleవాహనదారులకు తీపికబురు అందించిన కేంద్ర ప్రభుత్వం

వాహనదారులకు తీపికబురు అందించిన కేంద్ర ప్రభుత్వం

CENTER-EXTENDS-RTA-DEADLINES-ON-DRIVINGLICENSE-TILL-JUNE30TH

న్యూఢిల్లీ: కరోనా కేసులు పెరిగి భయపడుతున్న వేళ భరత వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం ఒక శుభవార్త తెలిపింది. వాహనదారుల డ్రైవింగ్ లైసెన్స్, వెహికల్ రిజిస్ట్రేషన్, ఫిట్‌నెస్ సర్టిఫికెట్, పర్మిట్ లాంటి వాటికి గడువును ఈ ఏడాది జూన్ 30 వరకు పెంచుతూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది.

దేశంలో ఇటీవల కరోనా పాజిటివ్ కేసుల పెరుగుతున్న కారణంగా ఈ డాక్యుమెంట్స్ ని రెన్యువల్ చేసుకోవడంలో వాహనదారులు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో కేంద్రం తాజాగా ఈ గడువును పొడిగించింది. గత ఏడాది ఫిబ్రవరి 1 నుంచి ఎక్స్‌పైరీ అయిన వాటి గడువు 2021 జూన్ 30 వరకు చెల్లుబాటు కానున్నట్లు తెలిపింది.

ఇంతకు ముందు ప్రభుత్వం ఇచ్చిన గడువు ఈ నెల 31తో ముగుస్తున్నందున తాజాగా ఈ గడువు పెంచింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలకు అడ్వైజరీని కేంద్ర రోడ్డు, రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ జారీ చేసింది. మోటార్ వెహికిల్ యాక్ట్-1988, సెంట్రల్ మోటార్ వెహికిల్ రూల్స్-1989 కి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నింటికీ ఈ గడువు పొడిగింపు వర్తిస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular