fbpx
HomeNationalకరోనా మరణాలతో బెంగళూరులో శ్మశానాలన్నీ ఫుల్

కరోనా మరణాలతో బెంగళూరులో శ్మశానాలన్నీ ఫుల్

BENGALURU-BURIAL-GROUNDS-FILLED-WITH-COVID-DEAD-BODIES

బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులో కరోనా కరాళనృత్యం చేస్తోంది. కరోనా బారిన పడి‌ మరణిస్తున్న వారి సంఖ్య రోజురోజుకి పెరిగుతోంది. శ్మశానాల వద్ద మృతదేహాలను తీసుకొచ్చిన వాహనాలు వరుసగా బారులు తీరుతున్న దృశ్యం కలచివేశ్తోంది.

బెంగళూరులో కోవిడ్‌ సోకడంతో రోజు దాదాపుగా 50 మంది వరకూ మరణిస్తున్నారు. నగరంలో ఉన్న 5 శ్మశానాల్లో కోవిడ్‌ మృతులకు అంత్యక్రియలు చేస్తున్నారు. ప్రతి రోజూ కనీసం 20 మృతదేహాలకు అంత్యక్రియలు జరుగుతున్నాయి. శ్మశాన వాటిక వద్ద ఒక్కో అంబులెన్సు అంత్యక్రియల కోసం దాదాపు నాలుగైదు గంటల వరకు క్యూలలో వేచి చూడాల్సి వస్తోంది.

బెంగళూరు జాలహళ్లి వద్ద ఉన్న సుమనహళ్లి, కెంగేరి, బొమ్మనహళ్లి, పెనత్తూరు శ్మశానవాటికల్లో కోవిడ్‌ సోకి మరణించిన మృతదేహాలకు అంత్యక్రియలు చేస్తున్నారు. కోవిడ్‌ ఆంక్షల నేపథ్యంలో అవసరమైన అన్ని ముందస్తు జాగ్రత్తలతో ఈ ప్రాంతాల్లో అంత్యక్రియలు చేపడుతున్నారు. ఇదే సమయంలో అంత్యక్రియలు చేసే సిబ్బందికి అత్యంత అవసరమైన పీపీఈ కిట్లు లభించడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

కాగా ఈ ఏడాది ఏప్రిల్‌లో ఇప్పటి వరకు దాదాపు 280 మంది బెంగళూరు వాసులు కోవిడ్‌తో మృత్యువాత పడ్డారు. ఏప్రిల్‌ 13,14 తేదీల్లో కరోనా సోకి 55 మంది మృత్యువాత పడ్డారు. ఈ ఏడాది జనవరిలో 66మంది, ఫిబ్రవరిలో 88, మార్చిలో 147, ఏప్రిల్‌లో 280 మంది మరణించారు. ఇందులో 210 మందికి పైగా 60 ఏళ్లు పైబడిన వృద్ధులే ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular